టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ టోర్నమెంట్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్, ఇండియన్ స్టార్ షట్లర్ సైనా నేహ్వాల్ ఓటమిపాలయ్యారు. తెలుగుతేజం పీవీ సిందూ బాట పట్టి స్వదేశానికి తిరుగుపయనం అయ్యింది. టోక్యోలోగురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో జపాన్ క్రీడాకారిణి, అన్ సీడెడ్ మినాట్సు మితాని చేతిలో 21-13, 21-16 తేడాతో సైనా ఓటమి పాలైంది. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో రెండు సెట్లలోనూ సైనాపై ప్రత్యర్ధి జపాన్ క్రీడాకారిణి ఆధిపత్యం చెలాయించడం గమనార్హం.
తొలి రౌండ్ లో సింధుతో జరిగిన పోరులోనూ మూడు సెట్లలో అధిపత్యాన్ని కనబర్చి చెలరేగిపోతున్న మితాని, సైనాతో జరిగిన మ్యాచ్ లోనూ అదే దూకుడుతో వ్యవహరించిన ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ పై గెలుపోందింది. తాజాగా ప్రపంచ టాప్ ర్యాంకర్ సైనాను ఇంటిదారి పట్టించింది. సైనాపై గెలుపుతో 5-2 తేడాతో తన గెలుపోటముల రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. ఇక మరోవైపు హెచ్ ఎస్ ప్రణాయ్ కూడా ఇంటిదారి పట్టాడు. తొలిరౌండ్ విజయం సాధించిన ప్రణయ్ రెండో రౌండ్ లో కొరియాకు చెందిన లీడాంగ్ కియన్ చేతిలో 9-21, 16-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.
సుమారు 43 నిమిషాల పాటు సాగిన పోరులో రెండు సెట్లలోనే జపాన్ క్రీడాకారుడు అధిపత్యం ప్రదర్శించాడు. దీంతో జపాన్ ఓపెన్ లో మహిళల అద్యయనం ముగిసిపోయింది. ఇప్పటికే పీవీ సింధూ సహా మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల - అశ్వనిపొన్నప్ప జంట చైనా జంట ఎనిమిదో సీడ్ జుహో యున్ లీ- జాంగ్ జంట చేతిలో 22-20, 18-21, 21-13 స్కోర్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more