ఏ విభాగంలోనైనా సరే.. భారత్ - పాకిస్తాన్ ల మధ్య జరిగే పోరాటం ఎంతో ప్రత్యేకంగా వుండిపోతుంది. ముఖ్యంగా క్రీడారంగంలో అయితే ఈ రెండు దేశాల మధ్య జరిగే పోటీ ఎంతో ఉత్కంఠభరితంగా వుండిపోతుంది. అందులో క్రికెట్ గురంచి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక హాకీ విషయానికి వస్తే.. ఆ రంగంలోనూ భారత్, పాకిస్తాన్ పై జూలు విదిల్చింది. ప్రత్యర్థి జట్టుకు ఒక్క అవకాశం ఇవ్వకుండా ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు చూపించేశారు. ఒకవైపు భారత్ వరుసగా గోల్స్ వేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంటే... మరోవైపు పాక్ ఆటగాళ్లను బంతికోసం పరుగులు వేయించింది.
ఇటీవల ఆసియా క్రీడల్లో జరిగిన హాకీ ఫైనల్లో ఇండియా, పాకిస్తాన్ ను మట్టికరిపించిన విషయం తెలిసిందే! ఇప్పుడు మరోసారి వారినే ఆదర్శంగా తీసుకున్న జూనియర్లు కూడా పాక్ పై చెలరేగిపోయారు. సుల్తాన్ జొహర్ కప్ అండర్-21 టోర్నమెంట్ లో భాగంగా బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ 6-0 స్కోరుతో పాకిస్తాన్ ను చిత్తుచేసేసింది. మ్యాచ్ ప్రారంభదశలో ఇద్దరూ జట్టు హోరాహోరీగా తలపడినా.. కొద్దిసేపటి తరువాత టీమిండియా ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఇరుజట్లలో ఆటగాళ్లు కొత్తవాళ్లయినప్పటికీ... ఇండియా క్రీడాకారులు మాత్రం అధ్భుతమైన ప్రతిభతో తమ సత్తా చాటుకున్నారు.
మొదట్లో ఇరుజట్టు హోరాహోరీగా తలపడిన నేపథ్యంలో ఏ జట్టు గోల్ సాధించలేకపోయింది కానీ.. ఆట 22వ నిముషంలో లభించిన పెనాల్టీ కార్నర్ ను ఇమ్రాన్ ఖాన్ గోల్ గా మలిచి, భారత్ కు బోణీ చేయించాడు. దాంతో ఇండియా జట్టు ఆధిపత్యాన్ని సాధించింది. అలాగే 34వ నిముషంలో పర్వీందర్ సింగ్ తన నైపుణ్యంతో భారత్ ఖాతాలో రెండో గోల్ ను చేర్చాడు. 49 నిముషంలో అర్మాన్ ఖురేషీ, 53వ నిముషంలో హర్మాన్ ప్రీత్ సింగ్, 67వ నిముషంలో వరుణ్ కుమార్, ఇక చివర్లో అర్మాన్ ఆటగాళ్లందరూ వరుసగా గోల్స్ సాధించి, ఇండియాకు భారీ విజయాన్ని అందించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more