ప్రధాని నరేంద్రమోడీ దేశ అభివృద్ధిలో భాగంగా అన్నీరంగాలను ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. ఒకవైపు పేదలకోసం ఎన్నో పథకాలను అమలులోకి తీసుకొచ్చిన మోడీ... అలాగే క్రీడల అభివృద్ధికోసం అదనంగా నిధులను కేటాయించారు. దాదాపు రూ.450 కోట్లు క్రీడల కోసం ప్రధాని మోడీ నిధులను కేటాయించినట్లు క్రీడల మంత్రి సోనోవాల్ వెల్లడించారు. ‘‘గతంలో ఎప్పుడూలేని విధంగా ప్రధాని మోడీ రూ.450 కోట్లు అదనంగా మంజూరు చేశారు. ఇలాంటి చొరన ఇదే మొదటిసారి’’ అంటూ సోనోవాల్ పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో పతక విజేతలను మంగళవారం తన నివాసంలో ప్రధాని మోడీ సన్మానించిన సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని తెలిపారు.
ఆసియా క్రీడలతోపాటు ఇతర టోర్నీల్లో పతకాలు గెలుచుకున్న వారందరికీ ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం అభినందించారు. క్రీడాకారులకు అల్పాహార విందు ఇచ్చిన ఆయన... రాజకీయ నాయకులలాగే దేశానికి ఎంతో మేలు చేస్తున్నారని అన్నారు. అలాగే మంగళ్ యాన్ ను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలలాగే ఈ క్రీడాకారులు కూడా దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారని మోడీ అన్నారు. క్రీడాకారులతో ముచ్చటించిన అనంతరం ఆయన ‘‘ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో ముచ్చటించా. వారు దేశానికి గర్వకారణం’’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన క్రీడాకారులకు ఒక ఆఫర్ ను కూడా ఇచ్చారు. క్రీడాకారులు స్వేచ్ఛగా తనకు సలహాలు ఇవ్వొచ్చని, ఏదైనా మాట్లాడాలనుకుంటే వ్యక్తిగతంగా నేరుగా కలవచ్చని చెప్పారు. ‘‘నన్నూ మీ స్నేహితుడిగానే భావించండి’’ అంటూ ఆయన క్రీడాకారులతో అన్నట్లు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం కృషి చేసిన వారందరితోపాటు బాక్సర్ మేరీకోమ్ ను ఆయన అభినందించారు. ఆసియా క్రీడల్లో అధ్భుత ప్రతిభతో స్వర్ణం సాధించిన సాకేత్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more