భారత మహిళలు ఎంత ఎత్తుకి ఎదిగినా.. వారికి వేధింపులు మాత్రం తప్పలేదు. సాధారణ మహిళల విషయాలను పక్కనపెడితే... నిన్న జరిగిన ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి, ఇండియా గౌరవాన్ని నిలబెట్టిన సీమా పూనియాకు సైతం అధికారుల నుంచి వేధింపులు తప్పలేదు. ఈమె మీద ఈ వేధింపులు ఇప్పటినుంచే కాదు.. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తూనే వున్నానని ఆమె స్వయంగా ప్రకటించింది. గత 14 ఏళ్లుగా సీమా మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... అధికారులు తనపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని తెలిపింది.
భారతీయ క్రీడాకారిణి అయిన సీమాపూనియా తనవంతు మంచి ప్రదర్శనను కనబరిచి, ఎన్నో పతకాలు సాధించి దేశగౌరవాన్ని నిలపెట్టడంలో కీలకపాత్రను పోషించింది. అయినా తన ప్రదర్శనకు తగ్గట్టు అధికారులు ఆమెను గౌరవించడం లేదని ఆవేదనను వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను జూనియర్ ఛాంపియన్ షిప్ లో పతక విజేతను. వరుసగా మూడు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలిచా.. ఇప్పుడు ఇంచియాన్ ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించాను. దశాబ్దానికిపైగా వున్న నా సుదీర్ఘ కెరీర్ లో దేశానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చాను. అటువంటి సమయంలో నాపట్ల మరింత హుందాగా వుండాల్సిందిపోయి.. అధికారులు నేనేం సాధించినా అనుమానంగానే చూశారు. ఇదెక్కడి న్యాయం’’ అంటూ వివరించింది.
అధికారులు సీమాను చిన్నచూపు చూడటానికి ఒక ప్రముఖ కారణం కూడా వుంది. 2000 ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ లో సీమా స్వర్ణపతకం సాధించి, భారత్ గౌరవాన్ని నిలబెట్టింది కానీ.. డోప్ పరీక్షల్లో దొరికిపోవడంతో ఆ పతకాన్ని వెనక్కి తీసేసుకున్నారు. దీంతో అప్పటినుంచి అధికారులు ఈమెను అంతగా పట్టించుకోవడం లేదు. పైగా అలాగే ఇతర ఆటల్లో కూడా డోప్ పరీక్షల్లో ఎక్కడ దొరికిపోతుందేమోనన్న భయంతో వున్నట్లు సదరు అధికారులు వాపోతున్నారు. అయినా.. ఎప్పుడో జరిగిన సంఘటనకు ఇప్పటివరకు సీమాను దోషిగానే చూడటం సరికాదని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more