భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు అని.. ఈ ఫార్మాట్తో తమతో అంత వీజీ కాదని తెలిపాడు. టీ20 సిరీస్లో భారత్ను ఓడించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. శుక్రవారం తొలి టీ20 ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన పూరన్ టీ20 సిరీస్ ను తామే కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
ఇంకా ఆయన ఏమన్నాడంటే.. ‘వన్డేలతో పోల్చితే టీ20లలో మాది ప్రత్యేకమైన జట్టు. ఈ సిరీస్లో మేము టీమిండియాను ఓడిస్తాం. జట్టులో ఆటగాళ్లంతా సవాళ్లకు సిద్ధంగా ఉన్నారు..’ అని తెలిపాడు. ఈ సిరీస్ కోసం కరేబియన్ జట్టు టీ20 స్పెషలిస్టు షిమ్రన్ హెట్మెయర్ను జట్టులోకి ఎంపిక చేసింది. అతడి చేరిక జట్టుకు ఉపకరిస్తుందని పూరన్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్లో తాము భాగస్వామ్యాల మీద దృష్టి పెట్టాల్సి ఉందని పూరన్ అన్నాడు. తద్వారా భారీ స్కోరు చేసే అవకాశం చిక్కుతుందని చెప్పాడు.
ఇదిలాఉండగా భారత్తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్కు విండీస్ జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన ఈ జట్టులో హెట్మెయర్తో పాటు జేసన్ హోల్డర్నూ చేర్చింది. భారత్తో టీ20 సిరీస్కు విండీస్ జట్టు : నికోలస్ పూరన్ (కెప్టెన్), రొవ్మన్ పావెల్, బ్రూక్స్, డొమినిక్ డ్రేక్స్, షిమ్రన్ హెట్మెయర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్కాయ్, కీమో పాల్, రొమారియా షెఫర్డ్, ఒడియన్ స్మిత్, డెవాన్ థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more