టీమిండియా వరల్డ్ కప్ హీరోగా ఎవరినైనా ప్రస్తావనకు వస్తే అందులో ప్రముఖంగా వినిపించే పేరు మాత్రం ఆల్ టైమ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్ జట్టు 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్ లు గెలిచిందంటే అందులో యువరాజ్ పాత్ర కూడా కీలకమైనదే. అతడి బౌలింగ్, ఫీల్డింగ్ సహా బ్యాటింగ్ గురించి తెలియని భారతీయుడే కాదు.. క్రికెట్ అభిమాని వుండండనే చెప్పాలి. అతడి ఘనకీర్తి విశ్వవ్యాప్తం. ఇక ధోనీసేన వన్డేల్లో రెండోసారి విశ్వవిజేత నిలివడంలోనూ అతని పాత్ర అత్యంత కీలకం. అయితే ఇలా వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే యవరాజ్ సింగ్ అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే.
ప్రత్యర్థి జట్లపై గెలుపే కాదు ప్రాణాంతమైన క్యాన్సర్ వ్యాధిని కూడా జయించాడు యువరాజు. ఈ విషయమై ఓ స్పోర్ట్స్ మ్యాగజీన్ తో పలు ఆసక్తికర విషయాలు ఈ ఎడమ చేతి వాటం గల క్రికెటర్ పంచుకున్నారు. తాను క్యాన్సర్ తో బాధపడుతున్న నాటి పరిస్థితుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మాటలు ఉపయోగపడ్డాయని చెప్పాడు. తాను నిత్యం సచిన్ టెండుల్కర్ తో మాట్లాడేవాడినని, ఆయన అప్పట్లో చెప్పిన మాటలతోనే తాను మళ్లీ క్రికెట్ ప్రపంచంలోకి అడుగెపెట్టేలా దోహదపడ్డాయని తెలిపాడు. సచిన్ మాటలతోనే తాను ఎంతో ప్రేరణ పోందానని కూడా అన్నారు యువరాజ్.
క్యాన్సర్ నుంచి కోలుకున్నాక మళ్లీ దేశవాళి క్రికెట్ లో ఆడాల్సివచ్చినప్పుడు తన కెరీర్ ఒడుదొడుకుల్లో సాగిందని అన్నాడు యువీ. దాంతో ఈ పరిస్థితులను ఎదుర్కోనడానికి సచిన్ తో మాట్లాడానని అన్నాడు. తమ సంభాషణలో సచిన్ తనకు కొన్ని ప్రశ్నలు వేశాడని, ‘మనమెందుకు క్రికెట్ ఆడతాం? ఆటపై ఉన్న ప్రేమతోనే ఆడాలనుకుంటాం. క్రికెట్ ను ప్రేమిస్తే.. నీకు ఆడాలనిపిస్తుంది. ఒకవేళ ఇదే పరిస్థితిలో నేనుంటే నాకు కూడా ఏం చేయాలో తెలియకపోవచ్చు. కానీ ఆటమీద నీకు ఇష్టముంటే ఆడుతూనే ఉండు. అలాగే నీకు ఇష్టమొచ్చినప్పుడే రిటైరవ్వు. అది ఇతరులు నిర్ణయించకూడదు’ అని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. అవి తనకు స్పూర్తిని కలిగించాయన్నాడు. వాటితో తాను మరో నాలుగైదు ఏళ్ల పాటు క్రికెట్ అడానని తెలిపాడు యువీ.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more