కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఈ వైరస్ ధాటికి పాకిస్తాన్ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని కరోనా బాధితులను అదుకునేందుకు దేశాలు ముందుకు రావాలని పలువురు క్రికెటర్లు ప్రాధేయపడుతున్నారు. అయితే ఇవేమీ తమకు పట్టనట్టు కొందరు క్రికెటర్లు వ్యవహరిస్తున్నారు. క్రికెట్ లో తమ మెరుగైన అటతీరును ప్రదర్శించి.. ఖ్యాతితో పాటు దేశ గౌరవాన్ని కూడా నిలిపే గర్వపడేందుకు బదులు దేశం పరువుతీయడంతో పాటు తమకు దక్కిన అకాశాన్ని కూడా చేజార్చుకుంటున్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ అరోపణలు ఎదుర్కోంటూ అవినీతికి పాల్పడిన కేసులో ఓ పాకిస్థానీ క్రికెటర్ కు ఇవాళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. క్రికెటర్ పై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో పాకిస్థానీ వివాదాస్పద క్రికెటర్ ఉమర్ అక్మల్పై మూడు సంవత్సరాల పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిసిప్లినరీ ప్యానల్ ప్రకటించింది. వివరాల్లోకెళితే.. పాకిస్థాన్ సూపర్ లీగ్లో అతను స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడినట్లు పీసీబీ అవినీతి నిరోధక శాఖ రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
దీంతో అతన్ని పీసీబీ అవినీతి నిరోధక చట్టంలోని ఆర్టికల్ 2.4.4 ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అతన్ని క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. మార్చి 31వ తేదీ లోపు అతను కోర్టులో విచారణకు హాజరుకావాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా.. లాహోర్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ.. డిసిప్లినరీ ప్యానల్ జస్టీల్ ఫజల్-ఏ-మిరాన్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగగిన విచారణలో అతనిపై ఉన్న ఆరోపణలు నిజాలని రుజువు కావడంతో.. అతనికి మూడేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. షేర్జీల్ ఖాన్ తర్వాత అవినీతి కేసులో నిషేధం ఎదురుకుంటున్న రెండో క్రికెటర్గా ఉమర్ నిలిచాడు. 2017లో షేర్జీల్ ఖాన్పై ఐదు సంవత్సరాల పాటు నిషేధం పడింది.
Umar Akmal handed three-year ban from all cricket by Chairman of the Disciplinary Panel Mr Justice (retired) Fazal-e-Miran Chauhan.
— PCB Media (@TheRealPCBMedia) April 27, 2020
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more