కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. పలు దేశాల్లో సరైన వ్యక్తిగత రక్షణ తొడుగులు లేకపోవడంతో వైరస్ సోకిన వారికి చికిత్స చేస్తోన్న వైద్యులు కూడా దాని కోరల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్లో వెంటిలేటర్ల కొరతపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్లు ఇచ్చి భారత్ తమ దేశాన్ని ఆదుకోవాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న తేడాలను మర్చిపోయి సాయం చేస్తే పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. పాకిస్థాన్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడమే ఆ అభ్యర్థనకు కారణం. ఇప్పటివరకు అక్కడ 4వేలకు పైబడి కేసులు నమోదయ్యాయి.
దీనికి సంబంధించి అక్తర్ ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ..‘భారత్ మాకు 10వేల వెంటిలేటర్లు అందిస్తే ఆ సహాయాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అయితే మేం మ్యాచ్ల గురించి మాత్రమే మాట్లాడగలం. మిగతాదంతా అధికారిక సంస్థలే నిర్ణయిస్తాయి’ అని వెల్లడించారు. పాకిస్థాన్లో కరోనా వైరస్ కట్టడికి తన ఛారిటీ సంస్థ ద్వారా అక్తర్ సహకారం అందిస్తున్నారు. ఆ సంస్థకు భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ విరాళాలు ఇచ్చారు. దాంతో వారిద్దరిపై నెట్టింట్లో వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. దానిపై అక్తర్ నెటిజన్ల విమర్శలకు బదులిచ్చారు. ‘వారిని విమర్శించడం దారుణం. వారి విరాళాలు ఒక దేశానికి, మతానికి ఇచ్చినవి కావు. అది మానవత్వానికి సంబంధించిన అంశం’ అని వారి ప్రయత్నానికి మద్దతు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more