కరోనావైరస్పై పోరాటం చేసేందుకు కావాల్సిన నిధులకోసం భారత్ పాక్ దేశాలమ తో క్రికెట్ మ్యాచ్లు ఆడాల్సిన గత్యంతరం పట్టలేదని కపిల్ ఘాటుగా స్పందించారు.దాయాదిదేశాల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన నిధులకోసం ప్రేక్షకులు స్టేడియానికి రాకుండా భారత్-పాక్ మధ్య మూడువన్డేల ద్వైపాక్షికసిరీస్ను ఏర్పాటు చేయాలని షోయబ్అక్తర్ బుధవారం తన అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై మాజీ లెజండరీ క్రికెటర్ స్పందిస్తూ.. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు భారత్ వద్ద పెద్దమొత్తంలో నిధులున్నాయ, క్రికెట్మ్యాచ్లు అవసరం లేదని పాక్ మాజీ క్రికెటర్ అక్తర్కు చురకలంటించాడు. అక్తర్ తన స్వంత అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని, కానీ ఇప్పటిపరిస్థితుల్లో ఇది ఏమాత్రం సమంజసం కాదని కపిల్ అన్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారిని ఎదుర్కొవడమనేది రెండుదేశాల ప్రభుత్వాలు పరస్పరం ఎలా సహకరించుకుంటున్నాయి.. అన్నదానిపై ఆధారపడిఉంటుందన్నారు. కానీ కొంతమంది ఇప్పటికీ వార్తా ఛానెళ్లలో కూర్చుని ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనాపై పోరులో ప్రభుత్వానికి అండగా ఉండేందకు ఇప్పటికే బీసీసీఐ పెద్దమొత్తంగా రూ.51 కోట్లరూపాయలను విరాళంగా ఇచ్చిందన్నారు. ఇంకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.ఈ విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ ఆడించి తమ క్రికెటర్లను ఇబ్బందుల్లో పడేసే ఉద్దేశం తమకు లేదన్నారు. వచ్చే ఆరునెలల వరకు క్రికెట్మ్యాచ్ల గురించి ఆలోచించకుండా ఉంటేనే మంచిదన్నారు. ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు ఇతర దేశాలకు సాయం చేసేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more