India beat Bangladesh by 18 runs in World Cup మహిళల టీ-20లో భారత్ మరో విజయం..

Icc women s t20 world cup shaifali verma shines as india beats bangladesh

Harmanpreet Kaur, women’s T20 World Cup, Shaifali Verma, Bangladesh, Team India, india women, Bangladesh women, poonam yadav, deepti sharma, harmanpreet kaur bhullar, womens t20 world cup 2020, Bangladesh women vs india women, cricket results, cricket news, cricket news liveCricket, Sports, sports news, cricket news, latest cricket news

Aided by Shafali Verma's quickfire 39 runs off 17 balls, the India cricket team beat Bangladesh by 18 runs in a Group A match of the ICC Women's T20 World Cup on Monday.

మహిళల టీ-20లో భారత్ శుభారంభం.. బంగ్లాపై గెలుపు

Posted: 02/24/2020 09:47 PM IST
Icc women s t20 world cup shaifali verma shines as india beats bangladesh

ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ అస్ట్రేలియాలోని పెర్త్ లో వాకా స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 143 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

టీమిండియా జట్టులో ఓపెనర్ షెఫాలీ వర్మ అద్బుతంగా రాణించింది. పదహారేళ్ల షెఫాలీ కేవలం 17 బందుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 39 పరుగులు సాధించింది. దీంతో స్మృతి మందన లేకుండా బరిలోకి దిగిన జట్టు విజయాన్ని అందుకుంది. షెఫాలీతో పాటు జెమిమా రోడ్రిగ్స్‌ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. బంగ్లా బ్యాటర్లలో ముర్షిదా (30, 26 బంతుల్లో; 4×4), నిగర్‌ సుల్తానా (35, 26 బంతుల్లో; 5×4) పోరాడారు. ఈ విజయంతో ప్రపంచకప్‌ గ్రూప్‌-ఎ పట్టికలో టీమ్‌ఇండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఓపెనర్‌ షమిమా (3)ను ఆదిలోనే శిఖ పాండే (2/14) ఔట్ చేసి ఆ జట్టను దెబ్బ తీసింది. కానీ సంజిదా (10)తో కలిసి ముర్షిదా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అయితే అరుంధతి (2/35), పూనమ్‌ (3/18) వీరిద్దరినీ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేర్చారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫాహిమా (17)తో కలిసి నిగర్‌ సుల్తానా (35) రన్‌రేటు తగ్గకుండా జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించసాగింది. భారత బౌలర్లు తిరిగి పుంజుకొని బంగ్లా బ్యాటర్లను క్రమం తప్పకుండా పెవిలియన్‌కు చేర్చారు. ఆఖర్లో జహారానా (10), రుమాన (13) విజయం కోసం పోరాడినా లాభం లేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles