ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ అస్ట్రేలియాలోని పెర్త్ లో వాకా స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 143 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
టీమిండియా జట్టులో ఓపెనర్ షెఫాలీ వర్మ అద్బుతంగా రాణించింది. పదహారేళ్ల షెఫాలీ కేవలం 17 బందుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 39 పరుగులు సాధించింది. దీంతో స్మృతి మందన లేకుండా బరిలోకి దిగిన జట్టు విజయాన్ని అందుకుంది. షెఫాలీతో పాటు జెమిమా రోడ్రిగ్స్ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. బంగ్లా బ్యాటర్లలో ముర్షిదా (30, 26 బంతుల్లో; 4×4), నిగర్ సుల్తానా (35, 26 బంతుల్లో; 5×4) పోరాడారు. ఈ విజయంతో ప్రపంచకప్ గ్రూప్-ఎ పట్టికలో టీమ్ఇండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఓపెనర్ షమిమా (3)ను ఆదిలోనే శిఖ పాండే (2/14) ఔట్ చేసి ఆ జట్టను దెబ్బ తీసింది. కానీ సంజిదా (10)తో కలిసి ముర్షిదా ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. అయితే అరుంధతి (2/35), పూనమ్ (3/18) వీరిద్దరినీ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్కు చేర్చారు. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన ఫాహిమా (17)తో కలిసి నిగర్ సుల్తానా (35) రన్రేటు తగ్గకుండా జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించసాగింది. భారత బౌలర్లు తిరిగి పుంజుకొని బంగ్లా బ్యాటర్లను క్రమం తప్పకుండా పెవిలియన్కు చేర్చారు. ఆఖర్లో జహారానా (10), రుమాన (13) విజయం కోసం పోరాడినా లాభం లేకపోయింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more