వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో మియామి వీధుల్లో చక్కర్లు కొడుతూ షికార్లు చేస్తున్నాడు. వెస్టిండీస్ పర్యటన కోసం టీమిండియా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకుంది. వెస్టిండీస్, టీమిండియా మధ్య తొలి టీ20 శనివారం జరగనుంది. తొలి టీ20కి సమయంలో ఉండడంతో కోహ్లీ ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ.. మరోవైపు భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు.
పిల్లలతో కలిసి కోహ్లీ ఎంజాయ్:
విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి మియామి వీధుల్లో చక్కర్లు కొట్టాడు. స్నేహితులతో కలిసి ఇద్దరూ సరదా సమయం గడిపారు. అందరూ ఓ హోటల్లో లంచ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అనంతరం మియామి వీధుల్లోని అభిమానులతో విరుష్క జంట సందడి చేసింది. ముఖ్యంగా కోహ్లీ చిన్న పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసాడు. అభిమానుల అందరితో ఇద్దరూ సెల్ఫీలు దిగారు. వారికి కోహ్లీ ఆటో గ్రాఫ్ కూడా ఇచ్చాడు.
సోషల్ మీడియాలో వైరల్:
ఫ్యాన్స్తో దిగిన ఫోటోలను అనుష్క శర్మ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్కు ముందు కూడా మాంచెస్టర్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. 2017 డిసెంబరు 11న ఇటలీలోని ఖరీదైన విల్లాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నా.. భారీ రిసెప్షన్ పెట్టి అందరినీ ఆహ్వానించారు.
ఫ్లోరిడాలో రెండు టీ20లు:
కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం సుదీర్ఘ పర్యటన కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి. ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడిన అనంతరం టీమిండియా వెస్టిండీస్ వెళ్లనుంది. సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్ పంత్ను వికెట్ కీపర్గా భాద్యతలు నిర్వర్తించనున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more