రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క మ్యాచ్ గెలుపుతో గాడిలో పడుతుందన్న సమయంలో ముంబైతో జరిగిన మ్యాచులో బౌలింగ్ కోచ్ తప్పుడు నిర్ణయంతో ఓడిపోవాల్సి రావడంతో ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రాపై బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబయి ఇండియన్స్కు చివరి 12 బంతులకు 22 పరుగులు అవసరమయ్యాయి.
క్రీజులో ముంబయి బ్యాట్స్మన్ హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ ఉన్నారు. 19వ ఓవర్ ను తొలుత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీతో వేయించాలని కోహ్లీ అనుకున్నాడు. అయితే, సైనీకి కాకుండా స్పిన్నర్ పవన్ నెగికి బంతి ఇవ్వాలని డగౌట్లో ఉన్న బెంగళూరు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా సూచించాడు. కోచ్ నిర్ణయం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకొని కోహ్లీ బంతిని పవన్ కు ఇచ్చాడు. ఆ ఓవర్ లో చెలరేగి ఆడిన పాండ్య 22 పరుగులు చేసి ఓవర్ ముగిసేలోపే మ్యాచ్ ను లాగేసుకున్నాడు.
దీంతో ఆశిష్ నిర్ణయంపై అభిమానులు మండిపడుతున్నారు. క్రీజులో పాండ్య, పొలార్డ్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నప్పుడు స్పిన్నర్లకు బౌలింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 140 కి.మీ వేగంతో బౌలింగ్ వేసే నవదీప్ సైనీకి బౌలింగ్ ఇచ్చి ఉంటే బ్యాట్స్ మెన్ కొంత ఇబ్బంది పడేవారని అంటున్నారు. బెంగళూరు గెలిచే అవకాశం ఉండేదని అంటున్నారు. ఈ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆశిష్ నెహ్రానే అంటున్నారు. ఆశిష్ నెహ్రా తలుచుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థిని కూడా యూనిట్ టెస్టులోనే ఫెయిల్ చేయగలడంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more