రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క మ్యాచ్ గెలుపుతో గాడిలో పడుతుందన్న సమయంలో ముంబైతో జరిగిన మ్యాచులో బౌలింగ్ కోచ్ తప్పుడు నిర్ణయంతో ఓడిపోవాల్సి రావడంతో ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రాపై బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబయి ఇండియన్స్కు చివరి 12 బంతులకు 22 పరుగులు అవసరమయ్యాయి.
క్రీజులో ముంబయి బ్యాట్స్మన్ హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ ఉన్నారు. 19వ ఓవర్ ను తొలుత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీతో వేయించాలని కోహ్లీ అనుకున్నాడు. అయితే, సైనీకి కాకుండా స్పిన్నర్ పవన్ నెగికి బంతి ఇవ్వాలని డగౌట్లో ఉన్న బెంగళూరు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా సూచించాడు. కోచ్ నిర్ణయం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకొని కోహ్లీ బంతిని పవన్ కు ఇచ్చాడు. ఆ ఓవర్ లో చెలరేగి ఆడిన పాండ్య 22 పరుగులు చేసి ఓవర్ ముగిసేలోపే మ్యాచ్ ను లాగేసుకున్నాడు.
దీంతో ఆశిష్ నిర్ణయంపై అభిమానులు మండిపడుతున్నారు. క్రీజులో పాండ్య, పొలార్డ్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నప్పుడు స్పిన్నర్లకు బౌలింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 140 కి.మీ వేగంతో బౌలింగ్ వేసే నవదీప్ సైనీకి బౌలింగ్ ఇచ్చి ఉంటే బ్యాట్స్ మెన్ కొంత ఇబ్బంది పడేవారని అంటున్నారు. బెంగళూరు గెలిచే అవకాశం ఉండేదని అంటున్నారు. ఈ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆశిష్ నెహ్రానే అంటున్నారు. ఆశిష్ నెహ్రా తలుచుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థిని కూడా యూనిట్ టెస్టులోనే ఫెయిల్ చేయగలడంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 29 | భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు... Read more
Jul 28 | బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్తో జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే ప్రోటిస్ పరాజయం పాలైన ప్పటికీ ఆ జట్టు యువ ఆల్ రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం... Read more
Jul 28 | భారత క్రికెటర్లు ప్రపంచ ఛాంపియన్స్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మహిళల జట్టు కూడా అదే స్థాయి ఆటగాళ్లన్న విషయాన్ని లో ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్... Read more
Jul 28 | వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అతిధ్యజట్టు వెస్టిండీస్ పై వారి సొంతగడ్డపైనే ఓడించి.. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడవ వన్డేలో హైదరాబాదుకు చెందిన టీమిండియా... Read more
Jul 18 | ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-3 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీమిండియా తన సత్తాను చాటింది. ఓవైపు టీ20 సిరీస్ తో పాటు... Read more