టీమిండియా సెలక్టర్ల తీరుపై మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లను తీసుకుని ఆడించడంలో అంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలా ఆటడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మొదటి మూడు వన్డే మ్యాచుల్లో మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్ ఇద్దరూ ఆడటంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యాలు చేశారు.
అయితే వీరిద్దరూ ఈ బ్యాటింగ్ లో అంతగా రాణించకపోవడం.. టీమిండియా ఓ మ్యాచ్ డ్రా కావడం, మరోటి ఓటమిపాలు కావడంతో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వీరిద్దరిలో ఒకరిని తీసుకుని మరోకరని మంచి యంగ్ బ్యాట్స్ మెన్ తో భర్తీ చేసివుండుంటే ఫలితాలు వేరేగా వుండేవని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధోనీ ఓ గొప్ప క్రికెటర్.. గొప్ప కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. ఫిట్గా కూడా ఉన్నాడు. కానీ, ప్రస్తుతం ఆయన ఆటతీరు బాగోలేదు. అందుకే ఆయన అన్ని ఫార్మాట్లలో ఆడలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డేల్లో ఆడిన ధోనీ, పంత్ లకు గువాహటిలో జరిగిన మొదటి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ వన్డేలో ప్రత్యర్థి జట్టును టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడించింది. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ధోనీ 20 పరుగులు, రిషబ్ పంత్ 17 పరుగులు చేశారు. ఈ వన్డే టైగా ముగిసింది. ఇక పుణెలో జరిగిన మూడో వన్డేలో ధోనీ 7, పంత్ 24 పరుగులు చేశారు. ఈ మ్యాచులో వెస్టిండీస్ బౌలింగ్ ధాటికి టీమిండియా బ్యాట్స్మెన్ ఆలౌట్ అయ్యారు. అయితే దీనిపై స్పందించి కోహ్లీ... ధోనీని కీపర్గా, పంత్ ని బ్యాట్స్ మెన్గా తీసుకున్నామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more