వెస్టిండీస్ జట్టు మెరుగ్గా ఆడటంతోనే ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లను భారత జట్టులోకి మళ్లీ సెలక్టర్లు ఎంపిక చేశారని వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా అభిప్రాయపడ్డాడు. విశాఖపట్నం వేదికగా గత బుధవారం జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13x4, 4x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ (123 నాటౌట్: 134 బంతుల్లో 10x4, 3x6) సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది.
తొలి రెండు వన్డేలకి బుమ్రా, భువీలకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు వారి స్థానంలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలను ఎంపిక చేశారు. కానీ.. ఈ ఇద్దరు పేసర్లూ రెండు వన్డేల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో.. చివరి మూడు వన్డేల కోసం గురువారం 15 మందితో కూడిన జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. షమీపై వేటు వేసి.. బుమ్రా, భువీలని మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు.
‘జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్లను మళ్లీ భారత జట్టులోకి ఎంపిక చేయడానికి కారణం సిరీస్లో వెస్టిండీస్ జట్టు బాగా ఆడుతుండటమేనని నాకు అనిపిస్తోంది. లేకపోతే..తొలి రెండు వన్డేలకి విశ్రాంతినిచ్చిన వారిని మళ్లీ ఎందుకు పిలిపిస్తున్నట్లు..? వన్డేల్లో అపార అనుభవం ఉన్న బుమ్రా, భువీలను మళ్లీ రప్పించిన ఘనత విండీస్కే చెందుతుంది’ అని స్టువర్ట్ లా ధీమా వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more