ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం పుణె వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-విండీస్ మధ్య జరగనున్న మూడో వన్డేలో భారత్ అధిపత్యం కోసం ప్రయత్నిస్తుండగా, విండీస్ గెలుపుకోసం పట్టుదలతో వుంది. పూణేలో జరుగుతున్న మూడో వన్డేను తమ ఖాతాలో వేసుకుని విండీస్ పై అధిపత్యం ప్రదర్శించాలని టీమిండియా వ్యూహాలు రచిన్తుండగా, గెలుపు అంచుల వరకు చేరి.. విజయాన్ని అస్వాదించ లేకపోయిన విండీస్.. తమ ఖాతాలో తొలి విజయాన్ని వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.
తొలి వన్డేను గెలుచుకున్న భారత్.. విశాఖలో జరిగిన రెండో వన్డేను డ్రాతో సరిపెట్టింది. దీంతో మూడో వన్డేలో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. రెండో వన్డే డ్రా గా ముగియడంతో కసితో రగిలిపో్యింది. దీంతో రేపటి వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పర్యాటక జట్టు భావిస్తోంది. ఇక చివరి మూడు వన్డేలకు పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలు అందుబాటులోకి రావడంతో భారత బౌలింగ్ మరింత బలోపేతం అయింది.
ముఖ్యంగా తొలి పవర్ ప్లే, డెత్ ఓవర్లలో వీరు ఆటను ప్రభావితం చేయగలరని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. వచ్చే ఏడాది ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టును ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రపంచకప్కు ముందు భారత్ ఆడేది ఇంకా 16 మ్యాచులే కాబట్టి అప్పటికి మిడిలార్డర్లో నిలకడ లేమిని సరిచేయడంతోపాటు, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ను బలోపేతం చేయాలని యోచిస్తోంది. శనివారం నాటి మ్యాచ్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more