వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ మిగతా మూడు మ్యాచ్ ల కోసం సెలక్షన్ కమిటీ జట్టుని ప్రకటించింది. యువ ఓపెనర్ పృథ్వీ షాకు జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం దియోదర ట్రోఫీలో ఇండియా ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షా.. నిన్నటి మ్యాచ్ లో గాయపడ్డటం కారణంగా ఆయనను ఎంపిక చేయలేదని సమాచారం. అయితే గాయపడిన పృథ్వీషాను ఎంఆర్ఐ స్కానింగ్ కోసం పంపడంతో ఆయన దియోధర ట్రోఫీ నుంచి అకస్మికంగా వైదొలగాల్సి వచ్చింది.
దీంతో గాయపడిన పృధ్వీ షాకు వన్డేలలో స్థానం ఇవ్వలేని బిసిసిఐ ఆయనను పక్కనబెట్టిందని సమాచారం. ఇక పృధ్వీతో పాటు మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపని పేస్ బౌలర్ షమీని జట్టు నుంచి తప్పించారు. ఈ క్రమంలో జట్టులోకి యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, స్వింగ్ ఆఫ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ లకు తిరిగి చోటు కల్పించారు. ఈ మార్పులు తప్పిస్తే మొదటి రెండు వన్డేల్లో ఆడిన మిగతా జట్టు సభ్యులను అలాగే ఉంచారు.
మూడు వన్డేలకు భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషభ్ పంత్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్, ఉమేష్ యాదవ్, కెఎల్ రాహుల్, మనీష్ పాండే
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more