కాశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నపాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదికి ఇదివరకే పలువురు టీమిండియా క్రికెటర్ల విమర్శించారు. గౌతమ్ గంభీర్ అయితే మరీ ఘాటుగా రిప్లై పోస్టు చేశాడు. కాగా తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా అఫ్రీదీపై ఘాటుగా విరుచుకుపడ్డాడు. ఇటీవల కాశ్మీర్ లో 12 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన నేపథ్యంలో స్పందించిన అఫ్రీది.. కాశ్మీర్ ప్రజలపై అణిచివేత తీవ్రంగా కొనసాగుతోందని, అక్కడి ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు ఏమి చేస్తున్నాయని వరుస ట్వీట్లు చేశాడు.
అఫ్రీది ట్విట్లపై యావత్ దేశం నుంచి ఆయనకు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా క్రికెటర్లు సురేష్ రైనా, గౌతం గంభీర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఘాటుగా సమాధానాలిచ్చారు. ఇక తాజాగా సచిన్ కూడా అఫ్రీది ట్వీట్లపై స్పందించాడు. తాము ఏమి చేయాలో బయటి వ్యక్తులు చెప్పాల్సిన పనిలేదన్నాడు. ఇది దేశానికి దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమన్న సచిన్ ఘాటుగా బదులిచ్చాడు. ఇక ఆయన చేసిన ట్విట్ ఇది.. `దేశాన్ని నడిపించే సమర్థమైన నేతలు మనకున్నారు. మనం ఏమి చేయాలో బయటి వ్యక్తులు చెప్పాల్సిన పని లేద`ని సచిన్ అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more