టీమిండియా కోచ్ రవిశాస్త్రి విమర్శకులపై విరుచుకుపడ్డారు. టీమిండియా ఓడిపోతే భారత్లోని జనాలు (విమర్శకులను ఉద్దేశించి) ఆనందపడతారని అప్పుడప్పుడు తనకు అనిపిస్తుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-2 తేడాతో కోల్పోవడంపై విమర్శకుల నుంచి వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన 'మిడ్-డే' పత్రికతో మాట్లాడుతూ ఈ మేరకు ఘాటుగా స్పందించినట్లు అర్థమవుతోంది.
ఏ మ్యాచ్నైనా గెలుస్తామనే నమ్మకం తమకు ఎల్లప్పుడూ ఉంటుందని, అది కొద్దిమంది మాత్రమే గ్రహించారని, నిజానికి ఓడిన ఆ రెండు టెస్టు మ్యాచ్లను కూడా తాము గెలిచి ఉండేవాళ్లమని ఆయన చెప్పుకొచ్చారు. ఆ మ్యాచ్లు ఓడిపోగానే తదుపరి మ్యాచ్లు గెలవడమే గానీ డ్రా చేసుకోవడం ఉండరాదంటూ ఓ ప్రణాళికను రచించుకుని ముందుకు వెళ్లామని, ఫలితంగానే వన్డే, టీ-20 సిరీస్లను నెగ్గామని రవిశాస్త్రి వివరించారు. జోహ్నెస్ బర్గ్ పిచ్ పనికిమాలిన పిచ్ అని ఆయన వ్యాఖ్యానించారు.
దక్షిణాఫ్రికా సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఆడిన మొత్తం 12 మ్యాచ్లలో ఎనిమిది మ్యాచ్లు గెలిచామని ఆయన గుర్తు చేశారు. లంక ముక్కోణపు సిరీస్ గురించి కూడా ఆయన మాట్లాడారు. విరామం లేకుండా ఆడినందు వల్ల జట్టులో సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చామని, వారు కూడా మనుషులే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి ఫార్మాట్ అయినా సరే మన జట్టే గెలవాలని భారత అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటారని, మనదేశంలో వచ్చిన అతిపెద్ద చిక్కు ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more