ఐపీఎల్ అంటేనే అభిమానులకు పరుగుల పండగ. ఆటగాళ్లకు డబ్బుల పండగ. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ ద్వారా ఎందరో స్వదేశీ, విదేశీ క్రీడాకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఏడాది ఇంకా ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి చాలా సమయం ఉంది. అంతలోనే మన రికార్డుల రారాజు, భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఇంతకీ అదేంటంటే.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కింగ్ కోహ్లీని తిరిగి సొంతం చేసుకుంది. గరిష్ఠంగా రూ.17 కోట్లు చెల్లించి ఆర్సీబీ అట్టి పెట్టుకునే విధానంలో తిరిగి దక్కించుకుంది. సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ కోసం 2015లో దిల్లీ డేర్డెవిల్స్ అత్యధికంగా రూ.16 కోట్లకు వేలంలో పాడుకుంది. ఆ తర్వాత 2017 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ రూ.14.5కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. కోహ్లీ ధర రూ.15కోట్లు ఉండగా ఆర్సీబీ మరో రూ.2కోట్లు అదనంగా చెల్లించి మొత్తం రూ.17 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది. 10ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఆటగాడికి ఫ్రాంఛైజీలు ఇంత మొత్తాన్ని ఖర్చు చేయలేదు.
2018 ఐపీఎల్ కోసం అట్టి పెట్టుకునే విధానంలో అత్యధిక మొత్తాన్ని దక్కించుకున్న టాప్-5 ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
1. విరాట్ కోహ్లీ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ.17 కోట్లు
2. మహేంద్ర సింగ్ ధోనీ - చెన్నై సూపర్ కింగ్స్ - రూ.15 కోట్లు
3. రోహిత్ శర్మ - ముంబయి ఇండియన్స్: రూ.15 కోట్లు
4. స్టీవ్ స్మిత్ - రాజస్థాన్ రాయల్స్ - రూ.12 కోట్లు
5. డేవిడ్ వార్నర్ - సన్రైజర్స్ హైదరాబాద్ - రూ.12 కోట్లు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more