ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ 20 క్రికెట్ మ్యాచులో టీమిండియా ప్రపంచ రికార్డు ముంగిట వరకు దూసుకోచ్చినా.. తృటిలో వరల్డ్ రికార్డును మిస్సయ్యింది. అంతర్జాతీయ టీ 20లో టీమిండియా తన పేరున సరికొత్త రికార్డును సృష్టిస్తుందని అభిమానులు ఎంతగానో అశించి ఎంతగానో ఎదురుచూశారు. అయితే చివరి ఓవర్లలో వరుస వికెట్లు కొల్పోవడంతో అత్యధిక స్కోరు నమోదు కాకపోవడంతో అభిమానులు నిరాశచెందారు.
శ్రీలంకతో జరిగిన రెండో టీ 20లో 260 పరుగులు సాధించిన భారత్.. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కెందుకు నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక స్కోరు ఆస్ట్రేలియా( 263) పేరిట ఉంది.. గతేడాది శ్రీలంకపైనే ఆసీస్ అత్యధిక టీ 20 స్కోరును నమోదు చేయగా, ఇప్పుడు అదే జట్టుపై భారత్ అత్యధిక స్కోరును సాధించే అవకాశం వచ్చినా దాన్ని చేజార్చుకుంది.
తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ 20లో రోహిత్ శర్మ విధ్వంసకర ఆటను ప్రదర్శించాడు. తొలుత 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్.. అటు తరువాత మరో 12 బంతుల్లోనే మిగతా యాభై పరుగులు పూర్తి చేశాడు. ఫలితంగా 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ సాధించి అంతర్జాతీయ టీ 20ల్లో వేగవంతంగా సెంచరీ సాధించిన రికార్డును సమం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more