టీమీండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సాధారణంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు. ఆయన సతీమణి సాక్షి సోషల్ మీడియాలో ధోనీ, ఆయన కూతురు జివాకు సంబంధించిన పోస్టులు తరుచూ చేస్తున్నా ఆయన మాత్రం ఎప్పుడు ఎలాంటి పోస్టులు, కానీ ట్వీట్లు కానీ చేయడు. అయితే తాజాగా ధోనీ ఓ ట్వీట్ ని లైక్ చేయడం ట్విట్టర్ లో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. నవంబర్ 2009లో ట్విట్టర్ ఖాతా తెరిచిన ధోనీ ఇప్పటివరకూ 2013లో ఒకటి, 2014లో ఒక ట్వీట్ ని మాత్రమే లైక్ చేశాడు.
అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత 2017లో ‘ఇన్ ఖబర్’ అనే ఓ హిందీ పత్రిక పెట్టిన ఓ ట్వీట్ ని ధోనీ లైక్ చేశాడు. డిసెంబర్ 12న ఇన్ ఖబర్ ట్విట్టర్ ఖాతాలో ‘2019లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ, టీం ఇండియా గెలిచి తీరుతుంది..’ అంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ని ఎంఎస్ ధోని లైక్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు షాక్ అయ్యారు.
ఇదిలా ఉండగా ఆ మరుసటి రోజు ‘ధోనీ ట్విట్టర్ ఖాతా తెరిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఆయన లైక్ చేసిన మూడో ట్వీట్ ఇన్ ఖబర్ ప్రచురించిన 2019 ప్రపంచకప్ కి సంబంధించిన వార్త’ అని ఇన్ ఖబర్ మరో ట్వీట్ చేసింది. అయితే ధోని ఆ ట్వీట్ ఎందుకు లైక్ చేశారు అని నెటిజన్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే కొందరు ధోనీకి ఆ ప్రపంచకప్ భారత్ గెలవాలని కోరిక అందుకే ఆయన లైక్ చేశారని, లేదు వెటకారంగా ధోనీ ఆ ట్వీట్ ని లైక్ చేశారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more