MS Dhoni likes a tweet after three years మహేంద్రుడు మూడోసారి.. ఎందుకిలా చేశాడు..?

Ms dhoni likes a tweet after three years but social media gets a shocker

MS Dhoni‬, ‪Hardik Pandya‬, ‪India national cricket team, ICC Cricket World Cup 2019, sports news,sports, latest sports news, cricket news, cricket

MS Dhoni, India's most successful captain in terms of accolades have always been the cynosure of the netizens. But, MS seldom does hog the limelight for his tweets or social media posts.

మహేంద్రుడు మూడోసారి.. ఎందుకిలా చేశాడు..?

Posted: 12/14/2017 07:57 PM IST
Ms dhoni likes a tweet after three years but social media gets a shocker

టీమీండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సాధారణంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు. ఆయన సతీమణి సాక్షి సోషల్ మీడియాలో ధోనీ, ఆయన కూతురు జివాకు సంబంధించిన పోస్టులు తరుచూ చేస్తున్నా ఆయన మాత్రం ఎప్పుడు ఎలాంటి పోస్టులు, కానీ ట్వీట్లు కానీ చేయడు. అయితే తాజాగా ధోనీ ఓ ట్వీట్ ని లైక్ చేయడం ట్విట్టర్ లో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. నవంబర్ 2009లో ట్విట్టర్ ఖాతా తెరిచిన ధోనీ ఇప్పటివరకూ 2013లో ఒకటి, 2014లో ఒక ట్వీట్ ని మాత్రమే లైక్ చేశాడు.

అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత 2017లో ‘ఇన్ ఖబర్’ అనే ఓ హిందీ పత్రిక పెట్టిన ఓ ట్వీట్ ని ధోనీ లైక్ చేశాడు. డిసెంబర్ 12న ఇన్ ఖబర్ ట్విట్టర్ ఖాతాలో ‘2019లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ, టీం ఇండియా గెలిచి తీరుతుంది..’ అంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ని ఎంఎస్ ధోని లైక్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు షాక్ అయ్యారు.

ఇదిలా ఉండగా ఆ మరుసటి రోజు ‘ధోనీ ట్విట్టర్ ఖాతా తెరిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఆయన లైక్ చేసిన మూడో ట్వీట్ ఇన్ ఖబర్ ప్రచురించిన 2019 ప్రపంచకప్ కి సంబంధించిన వార్త’ అని ఇన్ ఖబర్ మరో ట్వీట్ చేసింది. అయితే ధోని ఆ ట్వీట్ ఎందుకు లైక్ చేశారు అని నెటిజన్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే కొందరు ధోనీకి ఆ ప్రపంచకప్‌ భారత్ గెలవాలని కోరిక అందుకే ఆయన లైక్ చేశారని, లేదు వెటకారంగా ధోనీ ఆ ట్వీట్ ని లైక్ చేశారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles