టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ అనుభవం జట్టుకు ఎంత అవసరమో తెలిపే ఘటన ఆదివారం శ్రీలంకతో జరగిన తొలి వన్డేలో మరోసారి తెలిసొచ్చింది. వికెట్లు టపటపా రాలిపోతున్న వేళ, భారత జట్టు మరోమారు అతి తక్కువ స్కోరుకు పరిమితమై అపఖ్యాతి మూటగట్టుకోబోతున్న సమయాన బరిలోకి దిగిన ధోనీ తన అనుభవంతో అడ్డకట్ట వేశాడు. 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత ఆటతీరుతో జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.
ఈ తరుణంలో కుల్దీప్ యాదవ్తో కలిసి వికెట్లు పడకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 87 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసి మరోమారు తానేంటో నిరూపించాడు. అయితే ఈ మ్యాచులో ఇంతకుమించిన ఘటన మరోకటి జరిగింది. శ్రీలంక స్పిన్నర్ పథిరన వేసిన 32వ ఓవర్లో జస్ప్రిత్ బుమ్రా ఎల్బీ అంటూ లంక క్రికెటర్లు అప్పీల్ చేయడంతో.. దానిని పరిగణలోకి తీసుకున్న అంపైర్ ఔట్ అని ప్రకటించే క్రమంలోనే.. ధోని స్పందిందాడు.
అయితే అది ఔట్ కాదని క్షణంలోని వెయ్యో వంతులోనే గ్రహించిన ధోనీ అంపైర్ తన వేలిని పైకెత్తేలోపే డీఆర్ఎస్ కోరాడు. ధోనీ అంచనా నిజమైంది. బంతి ఆఫ్ స్టంప్ పక్క నుంచి వెళ్లేదని సమీక్షలో తేలింది. అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయంలో ధోనీ స్పందించిన తీరు, అతడి క్రికెట్ పరిజ్ఞాన్ని చూసి అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. డీఆర్ఎస్ అంటే.. ధోనీ రివ్యూ సిస్టం అని కొత్త భాష్యం చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more