భారత్ – శ్రీలంకతో వన్డే మ్యాచ్ టైమింగ్స్ మారాయి. డిసెంబర్ 10వ తేదీ ఆదివారం జరగనున్న డే అండ్ నైట్ మ్యాచ్ షెడ్యూల్ మార్చారు. సాధారణంగా వన్డేల్లో డేనైట్ మ్యాచ్ అంటే మధ్యాహ్నం 1.30గంటలకు మొదలవుతుంది. రాత్రి పది గంటలకు పూర్తవుతుంది. ఇప్పుడు ఇండియా – శ్రీలంక మధ్య జరగబోయే వన్డే సిరీస్లో మొదటి, రెండో వన్డేలు డే-నైట్ మ్యాచ్లే అయినా.. ఉదయం 11.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. దీనికి కారణం ఈ మ్యాచ్లు జరిగేది ఉత్తర భారతంలో. మొదటి మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో కాగా.. రెండో వన్డే పంజాబ్లోని మొహాలీలో జరగనున్నాయి.
అసలే చలికాలం.. అందులోనూ ఉత్తర భారతం.. దట్టమైన పొగ మంచు అక్కడ సర్వసాధారణం. దీంతో రాత్రి మ్యాచ్లు ఆలస్యమైతే మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని భావించిన BCCI ఈ రెండు వన్డేలను మాత్రం ఉదయం 11.30కే ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మధ్యే ఢిల్లీలో జరిగిన మూడో టెస్ట్లో పొగమంచు, కాలుష్యం కారణంగా శ్రీలంక ఆటగాళ్లు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. మళ్లీ ఇలాంటి పరిస్థితులు రిపీట్ కాకూడదనే మార్నింగ్ సమయంలోనే మ్యాచ్ ప్రారంభిస్తే, చలి, మంచు లాంటి ప్రాబ్లమ్స్ ఉండవని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది బిసిసిఐ.
వైజాగ్ లో జరిగే మూడో వన్డే మాత్రం మధ్యాహ్నం 1.30గంటలకే ప్రారంభం అవుతుంది. ఆదివారం(డిసెంబర్-10) జరిగే తొలి వన్డే కోసం ఇప్పటికే రెండు జట్లు ధర్మశాల చేరుకున్నాయి. శ్రీలంక అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. భారత బౌలర్లు హార్దిక్ పాండ్యా, బుమ్రా, అక్షర్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ధర్మశాల వాతావరణానికి ఫిదా అయిన లంక క్రికెటర్లు.. సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more