శ్రీలంకతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తరువాత.. పర్యాటక జట్టుదో మూడు వన్డేలు కూడా అడనుంది అతిథ్య జట్టు టీమిండియా. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని మొహాలీలో జరగనున్న రెండో వన్డే అనంతరం ధోని తన కెరీర్కు వీడ్కోలు పలుకనున్నాడు. రెండో వన్డే అనంతరం తాను తన సుదీర్ఘ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ఇప్పటికీ అధికారులు ప్రకటించేశారు. ఈ విషయం ఏ మాత్రం అనుమానం లేకుండా అధికారికంగా కూడా ప్రకటించేశారు. అయితే ధోని మాత్రమే రిటైర్ అవుతున్నాడు.. కానీ ఎంఎస్ ధోని కాదు. ఈ విషయాన్ని గ్రహించాలి లేదా.. ఇరుకున పడతారు జాగ్రత్త. కాసింత కన్ఫూజన్ గా వుంది కదూ.
ధోని రిటైర్మంట్ నిజమే కానీ టీమిండియా మాజీ కెప్టెన్ ధోని విషయాన్ని మేం చెప్పడం లేదు. అంటే మేము చెప్పే ధోని మొహాలీ పోలీసు విభాగంలో పనిచేస్తున్న భద్రతా జాగిలం. పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న జాగిలం ధోని రిటైర్ కాబోతోంది. గత పదేళ్లుగా మొహాలీ జిల్లా పోలీసులకు ఈ స్నిఫర్ డాగ్ విశేష సేవలు అందిస్తోంది. ధోని కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో భద్రత విభాగంలోకి వచ్చిన ఈ జాగిలానికి ధోని పేరు పెట్టుకున్నారు. ధోని గ్రౌండ్ లో విజృంభిస్తే ఈ స్నిఫర్ డాగ్ డ్యూటీలో రెచ్చిపోయేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
మొహాలీలో డిసెంబర్ 13న శ్రీలంకతో జరిగే రెండో వన్డే అనంతరం ఈజాగిలం సేవలకు అధికారులు స్వస్తి పలకనున్నారు. ఇందుకోసం పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2011 ప్రపంచకప్ లో భారత్-పాక్ ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కు ఇరు దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఈ స్నిఫర్ డాగ్ తోనే తనిఖీ చేశారు. ఇది రోజుకు ఏడు గంటలే నిద్రపోయేదని, ప్రేలుడు పదార్ధాలు, బాంబులను పసిగట్టడంలో దిట్ట అని పోలీసులు తెలిపారు. ఎవరైన దీనిని దత్తత తీసుకోవాలి అంటే నామమాత్రపు ధర రూ.800లకే ఇస్తామని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more