Dhoni to retire after 2nd ODI in Mohali? లంకతో రెండో వన్డే తరువాత ధోని రిటైర్మెంట్..!

Dhoni to retire after india vs sri lanka 2nd odi in mohali

MS Dhoni, dhoni dog, India vs Sri Lanka, India vs Sri Lanka 2nd ODI, Mohali ODI, India vs Sri Lanka ODI series, PCA Stadium Mohali, Mohali Police, Mohali Police dog squad, MS Dhoni news

Dhoni will hang up his boots after the match. Dhoni is a sniffer dog working with the Mohali district police for the last 10 years. He is set to complete his service and retire after the match on December 13.

13న జరగనున్న రెండో వన్డే తరువాత ధోని రిటైర్మెంట్..!

Posted: 12/04/2017 09:15 PM IST
Dhoni to retire after india vs sri lanka 2nd odi in mohali

శ్రీలంకతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తరువాత.. పర్యాటక జట్టుదో మూడు వన్డేలు కూడా అడనుంది అతిథ్య జట్టు టీమిండియా. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని మొహాలీలో జరగనున్న రెండో వన్డే అనంతరం ధోని తన కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. రెండో వన్డే అనంతరం తాను తన సుదీర్ఘ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ఇప్పటికీ అధికారులు ప్రకటించేశారు. ఈ విషయం ఏ మాత్రం అనుమానం లేకుండా అధికారికంగా కూడా ప్రకటించేశారు. అయితే ధోని మాత్రమే రిటైర్ అవుతున్నాడు.. కానీ ఎంఎస్ ధోని కాదు. ఈ విషయాన్ని గ్రహించాలి లేదా.. ఇరుకున పడతారు జాగ్రత్త. కాసింత కన్ఫూజన్ గా వుంది కదూ.

ధోని రిటైర్మంట్ నిజమే కానీ టీమిండియా మాజీ కెప్టెన్ ధోని విషయాన్ని మేం చెప్పడం లేదు. అంటే మేము చెప్పే ధోని మొహాలీ పోలీసు విభాగంలో పనిచేస్తున్న భద్రతా జాగిలం. పంజాబ్‌ క్రికెట్ అసోషియేషన్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న జాగిలం ధోని రిటైర్ కాబోతోంది. గత పదేళ్లుగా మొహాలీ జిల్లా పోలీసులకు ఈ స్నిఫర్ డాగ్ విశేష సేవలు అందిస్తోంది. ధోని కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో భద్రత విభాగంలోకి వచ్చిన ఈ జాగిలానికి ధోని పేరు పెట్టుకున్నారు. ధోని గ్రౌండ్ లో విజృంభిస్తే ఈ స్నిఫర్‌ డాగ్ డ్యూటీలో రెచ్చిపోయేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

మొహాలీలో డిసెంబర్‌ 13న శ్రీలంకతో జరిగే రెండో వన్డే అనంతరం ఈజాగిలం సేవలకు అధికారులు స్వస్తి పలకనున్నారు. ఇందుకోసం పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2011 ప్రపంచకప్ లో భారత్‌-పాక్ ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కు ఇరు దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఈ స్నిఫర్‌ డాగ్ తోనే తనిఖీ చేశారు. ఇది రోజుకు ఏడు గంటలే నిద్రపోయేదని, ప్రేలుడు పదార్ధాలు, బాంబులను పసిగట్టడంలో దిట్ట అని పోలీసులు తెలిపారు. ఎవరైన దీనిని దత్తత తీసుకోవాలి అంటే నామమాత్రపు ధర రూ.800లకే ఇస్తామని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles