ఇంగ్లండ్ వేదికగా ఇటీవల ముగిసిన మహిళా ప్రపంచకప్ కు కూడా ప్రేక్షకాదరణ బాగానే వుంది. టోర్నీ అరంభంలో మిథాలీ రాజ్ చేసిన వ్యాఖ్యల కారణమో ఏమో తెలియదు కానీ ఏకంగా ఇటీవల ముగిసిన మహిళా వరల్డ్ కఫ్ కు రికార్డు స్థాయి ప్రేక్షకాదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 18 కోట్ల మంది ఈ టోర్నీని తిలకించినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరని మీడియా ప్రతినిధులు మీధాలీని ప్రశ్నించగా, అమె కౌంటర్ అటాక్ చేసింది. ఇదే ప్రశ్న మీరు క్రికెటర్లను అడగగలరా అని ప్రశ్నించింది. మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరని మీరు క్రికెటర్లను ప్రశ్నించిన తరవాత అ ప్రశ్నను మాకు సంధించండీ అని అమె బదులీయడంతో అది కాస్తా ప్రపంచకప్ కు ముందు సంచలనంగా మారింది.
ఇక దానికి తోడు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారత జట్టు అతిథ్య జట్టు ఇంగ్లాండ్ తో ప్రారంభమైన టోర్నీ అవే రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అంతకుముందు పర్యాయం 2013లో జరిగిన ప్రపంచకప్ తో పోలిస్తే ఈ సారి ప్రేక్షకాధరణ అధికంగా నమోదైంది. ఈ మెగా టోర్నీ జరుగుతున్న సమయంలో వీక్షించిన వారి సంఖ్య ఏకంగా 18 కోట్లకు చేరగా అది గత వరల్డ్ కప్ తో పోల్చితే 300 శాతం పెరిగినట్లు ఐసీసీ పేర్కొంది. టీవీల ద్వారా ఈ మ్యాచ్ ను అధికంగా వీక్షించిన వారిలో భారత్ , దక్షిణాఫ్రికాలే వున్నాయిని కూడా ఐసీసీ స్పష్టం చేసింది.
భారత్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 15.6 కోట్ల మంది మహిళల ప్రపంచ కప్ ప్రసారాలను వీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది కోట్ల మంది చూడగా, ఒక్క ఫైనల్ పోరును 12.6 కోట్ల మంది వీక్షించారు. భారత జట్టు ఫైనల్ కు చేరడంతో భారత్ లో వీక్షణ సమయం 500 శాతం పెరిగింది. దీనిపై ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్ సన్ హర్షం వ్యక్తం చేశారు. 'మహిళల క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానిక ఇదే తగిన సమయం. ఈ మెగా టోర్నీతో మహిళల క్రికెట్ ఆదరణ పెరిగింది. దానికి నిదర్శనం ఈ గణంకాలేనని ఆయన పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more