గాలే టెస్టులో విజయంతో దూకుడు మీదున్న టీమిండియా.. అదే జోరును కొలంబో టెస్టులోనూ కనబర్చింది. తొలిరోజు లంకేయులపై పూర్తి అధిపత్యాన్ని కనబర్చింది. బోజన విరామం తరువాత కాసేపు తడబడినట్టుగా కనిపించినా.. ఆ తరువాత పుంజుకుంది. మూడు టెస్టు సిరీస్ లలో భాగంగా అతిధ్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజన భారత ఆటగాళ్లు రాహుల్, పూజారా, రహానే రాణించడంతో పటిష్టస్థితికి చేరుకుంది. ఫలితంగా తొలిరోజు అట ముగిసే సమయానికి విరాట్ సేన మూడు వికెట్ల నష్టానికి 344 పరుగులను సాధించింది. ప్రస్తుతం పూజారా 128 పరుగులతో, రహానే 103 పరుగులతో క్రీజ్ లో వున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న టీమిండియా.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ దాటిగా అడి స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. రాహుల్ తో కలసి 10 ఓవర్లకే జట్టు స్కోరును 50 పరుగులు జోడించారు. ఆ తర్వాత దిల్రువన్ పెరీరా వేసిన బంతికి ధావన్ (35) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగి నిరాశపర్చాడు. ఆ తరవాత వచ్చిన పూజారాకు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్. కెరీర్ లో 50 టెస్టు అడుతున్న పూజారా.. రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కి 53 పరుగులు జోడించారు. లేని పరుగుకు పోయిన రాహుల్ 57 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రాణించలేకపోయాడు. 39వ ఓవర్లో హెరాత్ వేసిన బంతిని ఎదుర్కొన్న కోహ్లీ.. మాథ్యూస్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ క్రమంలో టీమిండియా అటగాళ్లు కొంత తడబాటుకు గురయ్యారు. క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే పూజరాతో కలసి స్కోరుబోర్డును పరుగులెత్తించే పనిలో పడ్డాడు. ఏకంగా 12 ఫోర్లతో తన శతకాన్ని నమోదు చేశారు. అంతకుముందే పూజరా 10 ఫోర్ల సాయంతో శతకాన్ని నమోదు చేశాడు. 50వ టెస్టు ఆడుతోన్న పుజారాకిది 13వ శతకం. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పుజారా-రహానె జోడీ నాలుగో వికెట్కి అజేయంగా 211 పరుగులను స్కోరుబోర్డుపై నిలిపింది. లంక బౌలర్లు హెరాత్, దిల్రువన్ పెరీరా చెరో వికెట్ దక్కించుకున్నారు.
పుజారా అరుదైన ఘనత..
తన కెరీర్ లోనే 50వ టెస్టు ఆడుతోన్న పుజారా టెస్టు ప్రారంభం నుంచే ఈ టెస్టుపై అశలను పెట్టుకున్నాడు. తన 50వ టెస్టులో ఖచ్చింతంగా భారీ స్కోరు చేయాలని నిర్ధేశించుకున్న పూజారా.. అదే ధోరణిలో అడుతూ శతకాన్ని నమోదు చేసి అరుధైన ఘనత సాధించాడు. 50వ టెస్టులో శతకాన్ని నమోదు చేసిన చటేశ్వర్ పూజారా దిగ్గజాల సరసన స్థానం పంపాదించాడు. 50 టెస్టుల్లోనే 4వేల పరుగులు పూర్తి చేసిన సునీల్ గవాస్కర్(4,947), రాహుల్ ద్రవిడ్(4,315), వీరేంద్ర సెహ్వాగ్(4,103) తర్వాతి స్థానంలో నిలిచాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more