మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా గాలె వేదికగా శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచులో అతిథ్య జట్టుకు ఫాలోఅన్ గండం వెన్నాడుతుంది. టీమిండియా అటగాళ్ల అద్భుత అటతీరుతో రెండోరోజు కూడా కొనసాగింది. భారత అటగాళ్లు అటు బ్యాటింగ్ లో రాణించగా, చివరకు టెయిల్ ఎండర్లు కూడా రాణించి జట్టుకు భారీ స్కోరును నమోదు చేయడంలో దోహదం చేశారు. అదే సమయంలో అటు శ్రీలంకపై టీమిండియా బౌలర్లు కూడా పట్టుబిగిస్తున్నారు. ఫలితంగా ఆటముగిసే సమయానికి శ్రీలంక 44 ఓవర్లకు 5వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో లంక టాపార్డర్ కుప్పకూలింది. ఓ దశలో 68 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంక, ఓపెనర్ ఉపల్ తరంగ హాఫ్ సెంచరీ ( 64) తో ఆదుకోవడంతో కాస్త కోలుకుంది. అయితే లేని పరుగుకోసం ప్రయత్నించిన తరంగ జట్టు స్కోరు 125 పరుగుల దగ్గర ఔటయ్యాడు. దీంతో లంక కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఏంజెలో మాథ్యూస్ ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ జాగ్రత్తగా ఆడాడు. రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి లంక 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. మాథ్యూస్ 54, పెరారా 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
అంతకుముందు 399/3 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్.. లంచ్ సమయానికే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు తొలి సెషన్ ఆరంభమైన కాసేపటికే చటేశ్వర పుజరా(153;265 బంతుల్లో 13 ఫోర్లు) నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆపై మరో ఓవర్ నైట్ ఆటగాడు రహానే(57;130 బంతుల్లో 3 ఫోర్లు) అవుట్ కావడంతో భారత్ 435 పరుగుల వద్ద ఐదో వికెట్ ను నష్టపోయింది. అటు తరువాత అశ్విన్(47; 60 బంతుల్లో 7 ఫోర్లు) మెరిశాడు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more