శ్రీలంక మాజీ దిగ్గజ అటగాడు, కెప్టెన్ అర్జున రణతుంగా పేల్చిన బాంబుకు టీమిండియా క్రకిెటర్లు ధీటుగా సమాధానమిస్తున్నారు. 2011 ప్రపంచకప్ లో భాగంగా భారత్-శ్రీలంకల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆయన సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీమిండియాకు చెందిన ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్.. రణతుంగా తాను చేసిన అరోపణలకు కట్టుబడి వుండాలని సూచించారు. అయితే అరోపణలకు తగ్గ అధారాలను కూడా ఆయన సేకరించుకుని వాటిని కూడా చూపాలని గంభీర్ పేర్కోన్నారు.
2011 ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను షాక్ కు గురి చేసిందని రణతుంగ అన్నారు. అప్పుడు కామెంటేటర్ గా తాను భారత్ లోని ముంబై నగరంలో వున్న వాంఖేడ్ స్టేడియంలోనే ఉన్నానని చెప్పారు. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లతో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి టీమిండియాకు 275 పరుగులు విజయలక్ష్యాన్ని నిర్దేశించిందని అన్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్... అదిలోనే సెహ్వాగ్, సచిన్ వికెట్లను కోల్పోయిందని చెప్పాడు. అప్పటివరకు పటిష్టస్థితిలో వున్న లంక.. అనూహ్యంగా మ్యాచ్ స్వరూపం మారిపోయి ఓటమిపాలవ్వడం తానను షాక్ కు గురిచేసిందని అన్నాడు.
శ్రీలంక బౌలింగ్, ఫీల్డింగ్ రెండూ పేలవంగా మారిపోయాయని... దీంతో, భారత్ విజేతగా నిలిచిందని చెప్పాడు. ఆ మ్యాచ్ లో శ్రీలంక ఆటతీరుపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నాడు. మరోవైపు, రణతుంగ వ్యాఖ్యలను అప్పటి భారత జట్టు సభ్యులు గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాలు ఖండించారు. రణతుంగ ఆరోపణలు తమను ఆశ్చర్యపరిచాయని, ఆయన వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, చూపించాలని అన్నారు. రణతుంగ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫైనల్స్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more