ఫైనల్ లో పాకిస్థాన్ సత్తా చాటింది. ఢిపెండింగ్ ఛాంపియన్ భారత్ ను మట్టి కరిపించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో 180 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. నిర్ణీత ఓవర్ల కంటే ముందే.. 30.3 ఓవర్లలోనే భారత ఆటగాళ్లందరూ ఔటయ్యారు. టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. ఘన చరితగల మన బ్యాట్స్ మెన్ ఒకరిని చూసి మరొకరు చేతులెత్తేశారు. ఏ దశలోనూ కూడా మన టాపార్డర్ బ్యాట్స్ మేన్ పోరాటపటిమ చూపించలేకపోయారు.
నిలకడ లేమితో సతమతమైన పాక్ ఆటగాళ్లు మాత్రం అటు బ్యాటింగులోను, ఇటు బౌలింగులోను కూడా సమష్టిగా రాణించారు. కాగా, నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసిన పాక్.. టీమిండియాకు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతిగా బరిలోకి దిగిన భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. అందరూ ఔటైపోతున్న తరుణంలో.. అంత ఒత్తిడిలోనూ నిలబడి ఆర్దిక్ పాండ్యా 76 పరుగులు చేయడం మాత్రం ఒక విశేషమనే చెప్పాలి. ఎట్టకేలకు పాక్ తమ దేశానికి చిరస్మరణీయమైన విజయాన్ని అందించటమే కాదు, 2007 టీ20 వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.
రోహిత్ శర్మ (0), ధావన్ (21), విరాట్ కోహ్లీ (5), యువరాజ్ సింగ్ (22), ధోనీ (4), జాదవ్ (9), పాండ్యా(76), జడేజా (15), అశ్విన్ (1), బుమ్రా (2), భువనేశ్వర్ ఒక్క పరుగు చేసి నాటౌట్ గా నిలిచాడు.
పాక్ బౌలింగ్:
మహ్మద్ అమీర్ - 3, హసన్ అలీ - 3, షాదాబ్ ఖాన్ - 2, జునైద్ ఖాన్-1
ఓటమికి కారణాలు విశ్లేషిస్తే.. స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న భారత్ ఫీల్డింగ్ పెద్ద తప్పుచేసిందని భావిస్తున్నారు. మరోవైపు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పాక్ మైండ్ గేమ్ ఆడింది. స్కోర్ బోర్డు పరుగులు పెట్టించి పాక్ బ్యాట్స్ మెన్స్ , కీలక వికెట్లు తీసి బౌలర్లు దాని మరింత ఎక్కువ చేసేశారు. 9 పరుగుల వద్ద ఫకర్ జమాన్ వికెట్ ను బుమ్రా నిర్లక్ష్యం మూలంగా భారీ జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత కోహ్లీ కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనించదగ్గ విషయం.
అన్నింటికి మించి వచ్చిన విమర్శలన్నింటిని తట్టుకుని పాకిస్థాన్ బాగా రాణించింది. ఓడిపోయి ఉంటే తమ దేశంలో వాళ్ల పరిస్థితి ఏంటో వాళ్లకి అర్థమైంది. అందుకే కసిగా ఆడి కప్పును ఎగరేసుకుపోయారు. ప్రతిగా అవమానకరమైన రీతిలో ఓటమికి టీవీలు బద్ధలు అవ్వటం, ఆటగాళ్లపై అభిమానుల ఆగ్రహజ్వాలలు మన దేశంలో కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more