నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న భారత జట్టు.. ఇక రెండో టెస్టు విజయంపై దృష్టి పెట్టింది. శనివారం నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని భారత్ జట్టు భావిస్తోంది. ఆ టెస్టులో గెలిస్తేనే సిరీస్ పై భారత్ ఆశలు పెట్టుకోవచ్చు.దాంతో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టు తన ప్రణాళికల్ని సిద్ధం చేసుకునే పనిలో పడింది. ఎలాగైనా తొలి టెస్టులో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది. తదుపరి టెస్టులో భారత్ జట్టు విజయం సాధిస్తే గనుక దశాబ్దానికి పైగా ఉన్న చరిత్ర పునరావృతం అవుతుంది.
2001లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబైలో్ని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత్ ను ఘోరంగా ఓడించిన ఆసీస్ సిరీస్ లో ఆధిక్యం సాధించింది. ఆ తరువాత కోల్ కతాలో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ ను భారత్ 171 పరుగుల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్ లో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా, భారత్ ను 171 పరుగులకు ఆలౌట్ చేసింది. దాంతో భారత్ జట్టు ఫాలో ఆన్ ఆడింది. అయితే ఇక్కడ ఇన్నింగ్స్ తేడాతో గెలుద్దామని భావించిన ఆసీస్ కు ద్రవిడ్-లక్ష్మణ్లు చుక్కలు చూపెట్టారు.
భారత జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్ల జోడి 376 భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఆ క్రమంలోనే లక్ష్మణ్ తన కెరీర్ బెస్ట్ 281 పరుగులు చేయగా, ద్రవిడ్ 180 పరుగులతో మెరిశాడు. దాంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 657 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్ కు 384 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించకల్గింది. ఇక తన గెలుపు సంగతిని పక్కను పెట్టి ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలా అనే పనిలో పడింది ఆనాటి ఆసీస్ . భారత స్పిన్ దెబ్బకు 212 పరుగులకే చాపచుట్టేసిన ఆసీస్ ఓటమి పాలైంది. ఆ తరువాత మూడో టెస్టును సైతం భారత్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది.
దాదాపు పదహారేళ్ల తరువాత అదే సీన్ ను ఆసీస్ రిపీట్ చేయడంతో రెండో టెస్టుపైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు.. భారత్ జట్టును 333 పరుగులతో ఓడించి సిరీస్ లో పైచేయి సాధించింది. మరి ఆనాటి చరిత్రను భారత్ పునరావృతం చేస్తుందా?లేదా? అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంచితే, అయితే ఇప్పుడు కెప్టెన్లు, జట్టు సభ్యులు మారినా.. రెండు జట్ల మధ్య అదే దూకుడు మాత్రం నెలకోంది. ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందని భారత అభిమానులు బలంగా వాదిస్తున్నారు. మరి వారి కలలు నెరవేరుతాయా..? లేదా..? అన్నది వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more