విరాట్ కోహ్లీ సేన హిస్టరీని రిపీట్ చేస్తుందా..? Can Virat Kohli's India repeat 2001 heroics vs Australia?

Can virat kohli s india repeat 2001 heroics vs australia

india a vs australia, india a vs australia warm-up game, india a vs australia pune match, ind a vs aus 2017, australia, india vs australia test 2017, virat kohli, ashwin, jadeja, steve smith, cricket news, cricket

“We’re not bothered about the opposition, we sure are aware of their skills, positives and negatives but try to focus on our game and plans rather than mulling over them,” said Kohli.

విరాట్ కోహ్లీ సేన హిస్టరీని రిపీట్ చేస్తుందా..?

Posted: 02/28/2017 08:38 PM IST
Can virat kohli s india repeat 2001 heroics vs australia

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న భారత జట్టు.. ఇక రెండో టెస్టు విజయంపై దృష్టి పెట్టింది. శనివారం నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని భారత్ జట్టు భావిస్తోంది. ఆ టెస్టులో గెలిస్తేనే సిరీస్ పై భారత్ ఆశలు పెట్టుకోవచ్చు.దాంతో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టు తన ప్రణాళికల్ని సిద్ధం చేసుకునే పనిలో పడింది. ఎలాగైనా తొలి టెస్టులో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది. తదుపరి టెస్టులో భారత్ జట్టు విజయం సాధిస్తే గనుక దశాబ్దానికి పైగా ఉన్న చరిత్ర పునరావృతం అవుతుంది.

2001లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబైలో్ని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత్ ను ఘోరంగా ఓడించిన ఆసీస్ సిరీస్ లో ఆధిక్యం సాధించింది. ఆ తరువాత కోల్ కతాలో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ ను భారత్ 171 పరుగుల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్ లో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా, భారత్ ను 171 పరుగులకు ఆలౌట్ చేసింది. దాంతో భారత్ జట్టు ఫాలో ఆన్ ఆడింది. అయితే ఇక్కడ ఇన్నింగ్స్ తేడాతో గెలుద్దామని భావించిన ఆసీస్ కు ద్రవిడ్-లక్ష్మణ్లు చుక్కలు చూపెట్టారు.

భారత జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్ల జోడి 376 భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఆ క్రమంలోనే లక్ష్మణ్ తన కెరీర్ బెస్ట్ 281 పరుగులు చేయగా, ద్రవిడ్ 180 పరుగులతో మెరిశాడు.  దాంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 657 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్ కు 384 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించకల్గింది.  ఇక తన గెలుపు సంగతిని పక్కను పెట్టి ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలా అనే పనిలో పడింది ఆనాటి ఆసీస్ . భారత స్పిన్ దెబ్బకు 212 పరుగులకే చాపచుట్టేసిన ఆసీస్ ఓటమి పాలైంది. ఆ తరువాత మూడో టెస్టును సైతం భారత్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది.

దాదాపు పదహారేళ్ల తరువాత అదే సీన్ ను ఆసీస్ రిపీట్ చేయడంతో రెండో టెస్టుపైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు.. భారత్ జట్టును 333 పరుగులతో ఓడించి సిరీస్ లో పైచేయి సాధించింది. మరి ఆనాటి చరిత్రను భారత్ పునరావృతం చేస్తుందా?లేదా? అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంచితే, అయితే ఇప్పుడు కెప్టెన్లు, జట్టు సభ్యులు మారినా.. రెండు జట్ల మధ్య అదే దూకుడు మాత్రం నెలకోంది. ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందని భారత అభిమానులు బలంగా వాదిస్తున్నారు. మరి వారి కలలు నెరవేరుతాయా..? లేదా..? అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  team india  Australia  Virat kohli  Steven Smith  Mumbai  cricket  sports news  cricket  

Other Articles