భారత్ జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తన రెండో ఇన్నింగ్స్ లో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిన ఆసీస్ కు ఓవరాల్ గా 298 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ రోజు ఆటలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(10), షాన్ మార్ష్(0) లు తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ, ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మూడో వికెట్ కు హ్యాండ్ స్కాంబ్(19) తో కలిసి 38 పరుగులు జత చేసిన స్మిత్.. నాల్గో వికెట్ కు రెన్ షా(31) తో కలిసి 52 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే స్మిత్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్మిత్ (59 బ్యాటింగ్; 117 బంతుల్లో 7 ఫోర్లు), మిచెల్ మార్ష్(21 బ్యాటింగ్;48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు క్రీజ్లో ఉన్నారు.
అంతకుముందు తొలిఇన్నింగ్స్ లో టీమిండియా అసీస్ బౌలర్ల ముంగిట మోకరిల్లింది. టెస్టు మ్యచ్ లో కేవలం నలభై ఓవర్లు మాత్రమే ఆడిన విరాట్ సేన ఇక తమ వల్ల కాదంటూ ఒకరి తరువాత ఒకరు వరుసగా పెవీలియన్ బాట పట్టడంతో విరాట్ సేన కేవలం స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. జట్టులో కేఎల్ రాహుల్ అర్థశతకంతో రాణించినా.. మిగతావారందరూ మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. టీ విరామానికి ముందుగానే ఆలౌట్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఈ రోజు ఆటలో 40.1 ఓవర్లు ఆడిన భారత్ జట్టు 105 పరుగులకే చాప చుట్టేసింది. 94 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయిన భారత్.. మరో 11 పరుగుల వ్యవధిలో మిగతా వికెట్లను కోల్పోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
ప్రధానంగా ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి భారత్ కు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ 33 ఓవర్ లో భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (64), రహానే(13),సాహా(0)లను ఓకీఫ్ పెవిలియన్ కు పంపాడు. ఆపై లయన్ బౌలింగ్ లో అశ్విన్(1)అవుట్ కావడంతో భారత్ వంద పరుగులలోపే ఏడో వికెట్ ను నష్టపోయింది. ఇక ఆపై తేరుకోలేని భారత్ మరో మూడు వికెట్లను కూడా వెంటనే కోల్పోయింది. చివరి మూడు వికెట్లను కూడా ఓకెఫీ సాధించడం విశేషం. ఓవరాల్ గా ఓకీఫ్ ఆరు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, అతనికి జతగా స్టార్క్ రెండు, హజల్ వుడ్, లయన్ లు తలో వికెట్ తీశారు. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అసీస్కు 165 పరుగుల అధిక్యంలో వుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more