భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు బిసిసిఐ నూతన సంవత్సరం కానుకగా కొత్త జెర్సీని అందించింది. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు ఈ కొత్త జర్సీతోనే టీమిండియా జట్టు పాల్గోనుంది. కాగా పర్యాటక జట్టుతో వన్డే సమరానికి సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు, మహిళా ఆటగాళ్లు నూతన జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
భారత జెర్సీలో స్వల్ప మార్పులు చేసిన నైకీ సంస్థ, బీసీసీఐతో కలిసి నూతన కిట్ ను ఆవిష్కరించింది. ప్రస్తుతం టీమిండియాకు నైకీ సంస్థ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, అజిక్యా రహానేలతో పాటుగా మహిళా టీమ్ ప్లేయర్స్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లను ఈ ఫొటోలో చూడవచ్చు. టీమిండియాకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొత్త కెప్టెన్ తో పాటు కొత్త జెర్సీతో ఈ ఏడాది ప్రారంభించబోతోంది.
గతంలో ప్లాస్టిక్ రీసైకిల్ చేసిన ప్రొడక్ట్స్ తో 2015లో చివరిసారిగా జెర్సీని ప్రవేశపెట్టారు. భుజాల పక్కన భారత త్రివర్ణ పతాక రంగులతో చారలను ప్రింట్ చేశారు. ఈ 15న కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ తో తలపడనున్న టీమిండియా నూతన జెర్సీతో బరిలోకి దిగనుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ జెర్సీలో 4డీ క్విక్ నెస్, ట్యూన్డ్ బ్రీతబిలిటీ, జీరో డిస్ట్రాక్షన్ ఫీచర్లు ఉన్నాయని.. ఎండ వేడిమిని తట్టుకునేందుకు జెర్సీ చాలా సౌకర్యంగా ఉంటుందని నైకీ సంస్థ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more