పర్యాటక జట్టు న్యూజిలాండ్తో మొహాలీ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డేలో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ ఇన్నింగ్ తో రాణించగా, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన దూకుడుతో శతకాన్ని నమోదు చేయడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వారిపై ప్రశంసలు జల్లు కురిపించారు.కోహ్లిలోనే కచ్చితత్వమే అతని బ్యాటింగ్ను స్థాయిని అమితంగా పెంచిందని కొనియాడాడు. కోహ్లి మైండ్ ను కంప్యూటర్ చిప్ తో పోల్చిన అతను మూడో వన్డేలో ఆతడి ఇన్నింగ్స్ కు ఇదే ఉదాహరణ అని గవాస్కర్ తెలిపాడు.
సాధారణంగా పీల్డ్ లేని చోట బంతులను కోట్టేందుకు బ్యాట్స్ మెన్లు ప్లేస్ మెంట్ చూసి షాట్లు కోడుతుంటారని, కానీ ఫీల్డర్లను మోహరించిన చోట కూడా అతని కచ్చితమైన కొలతలతో కొట్టే షాట్లు ఫీల్డర్లనే అయోమయంలో నెడుతుంటాయి. ఆ రకమైన ఆట తీరే అతను భారీ స్కోర్లు సాధించడానికి ఉపయోగపడుతుందని గవాస్కర్ తెలిపాడు. దాంతో పాటు క్రికెట్ ఫీల్డ్లో కోహ్లి ప్రవర్తించే తీరు చాలా హుందాగా ఉంటుందన్నాడు. అభిమానుల్ని, ప్రజల్ని ఆప్యాయంగా పలకరించే తీరే అతనిలో మానవీయ లక్షణాలను తెలుపుతుందన్నాడు. ప్రస్తుత క్రికెట్ లో యువ క్రికెటర్లకు కోహ్లి ఒక రోల్ మోడల్ అని గవాస్కర్ పేర్కొన్నాడు.
అటు ధోని కూడా బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ను చేశాడన్నాడు. 'ధోని నాల్గో స్థానంలో బ్యాటింగ్ రావడానికి అతనే కారణం. ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ లో వెనుకబడిపోతామనే విషయం ధోనికి తెలుసు. ఆ స్థానంలో బ్యాటింగ్ రావాల్సి ఉన్న మనీష్ పాండే, కేదర్ జాదవ్లు టాలెంట్ ఉన్న క్రికెటర్లే. కానీ వారికి అనుభవం తక్కువ. దాంతో ఆస్థానంలో బ్యాటింగ్ కు రావాలని ధోని తీసుకున్న నిర్ణయం సరైనదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
2011లో వరల్డ్ కప్ గెలిచిన సమయంలో కూడా ధోని ఇలానే ముందుకు వచ్చాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ రావాల్సిన యువరాజ్ ను పక్కకు పెట్టి, ధోని వచ్చాడు. పటిష్టమైన శ్రీలంక ఎటాక్ ను ఎదుర్కొనే క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చాడు. న్యూజిలాండ్ తో మూడో వన్డేలో కూడా ఆనాటి ధోని కనిపించాడు. అప్పటి బాధ్యత ధోనిలో మరోసారి కనిపించింది' అని గవాస్కర్ అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more