టీమిండియా ప్రతిష్టాత్మకమైన 500వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ప్రారంభం నుంచి అధిపత్యం వహించినట్లు కనిపించిన కివీస్ నుంచి భారత్ లాగేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థి న్యూజీలాండ్ బ్యాటింగ్ నుంచి చక్రం తిప్పని స్పీనర్లు.. రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా అధిపత్యం వహించి.. చారిత్రాత్మక మ్యాచ్ లో విజయాన్ని సాధించారు. ఈ నెల 22న కాన్పూరులో ప్రారంభమైన చారిత్రాత్మకమైన మ్యాచ్లో టీమిండియా విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయాన్ని మలుపు తిప్పింది మాత్రం భారత స్పిన్నర్లే. కాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రెండో ఇన్నింగ్స్ లో టెయిలెండర్లు రాణించడం వల్లే విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.
చివరి రోజున మ్యాచ్ ను డ్రా చేసేందుకు కివీస్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అరు వికెట్లు చేతిలో వుండటంతో తమ వికెట్లను కాపాడుకుంటూ నిదానంగా బ్యాటింగ్ చేసి డ్రా చేద్దామనుకుంటున్న న్యూజీలాండ్ అశలన్నింటినీ భారత్ బౌలర్లు దెబ్బతీశారు. ప్రత్యేకంగా ఈ సెషన్ లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే, పేసర్ మొహ్మద్ షమీ రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి కివీస్ను చావు దెబ్బకొట్టాడు. దాంతో న్యూజిలాండ్ కు ఘోర పరాజయానికి స్వాగతం పలకగా, భారత్ 'చారిత్రక' విజయం సాధించింది.
434 పరుగుల లక్ష్యంగా 93/4 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే తడబడింది. కివీస్ టాపార్డర్ ఆటగాడు ల్యూక్ రోంచీ(80; 120 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. రోంచీ నిలకడగా ఆడుతున్న సమయంలో రవీంద్ర జడేజా వేసిన చక్కటి బంతికి బోల్తా పడ్డాడు. ఆ తరువాత వాట్లింగ్(18), క్రెయిగ్(1)లను భారత ప్రధాన ఆయుధం మొహ్మద్ షమీ చేతికి చిక్కారు. వాట్లింగ్ ను ఎల్బీడబ్యూగా పెవిలియన్ కు పంపగా, ఆ తరువాతి ఓవర్ తొలి బంతికి క్రెయిగ్ బౌల్డ్ అయ్యాడు.
కాగా, తమ జట్టు గెలుపు ఒంటరిపోరాటం చేసిన సాంట్నార్(71) బాధ్యతాయుతంగా ఆడినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. సాంట్నార్ ఎనిమిదో వికెట్ గా అవుటైన తరువాత మిగిలిన ఇద్దరి ఆటగాళ్లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. దాంతో కివీస్ 236 పరుగులకే చాపచుట్టేయడంతో భారత్కు 197 పరుగుల భారీ విజయం దక్కింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు సాధించి కివీస్ ఇన్నింగ్స్ ను చెల్లాచెదురు చేయగా, షమీకి రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more