భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన అనిల్ కుంబ్లేకు బ్రిటీష్ ఎయిర్ వేస్ క్షమాపణలు కోరింది. "జరిగిన తప్పుకు క్షమించండి. మీ బ్యాగ్స్ సెయింట్ కిట్స్ కు చేరలేదు. ఇవి గాత్విక్ లో ఉండిపోయాయి. మీ సామాన్లు మీకు సాధ్యమైనంత త్వరగా అందిస్తాం" అని ట్వీట్ చేసింది. విషయం అర్థమైందా.. లేదా..? అనీల్ కుంబ్లే లగేజీని బ్రిటీష్ ఎయిర్వేస్ లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్లోనే మరచిపోవడంతో కుంబ్లేకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. భారత క్రికెట్ జట్టు ముంబైలో బయల్దేరి లండన్ మీదుగా సెయింట్ కిట్స్లో దిగింది.
ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే లగేజీ విషయంలో బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతని దుస్తులతో పాటు తదితర వస్తువులన్నీ లండన్ ఎయిర్ పోర్ట్లోనే ఉండిపోయాయి. అయితే కుంబ్లే మాత్రం జట్టుతో కలిసి విండీస్ కు చేరుకున్నాడు. ఈ మేరకు తర్వాత తన లగేజీ కోసం కుంబ్లే ఫిర్యాదుపై సదరు ఎయిర్వేస్ స్పందించింది. తాము చేసిన తప్పిదానికి క్షమించాలని, సాధ్యమైనంత త్వరగా కుంబ్లే లగేజీని అందజేస్తామని ట్విట్టర్ లో పేర్కొంది. గతంలో ఓసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు సైతం ఈ తరహా అనుభవమే ఎదురైంది. అప్పట్లో బ్రిటీష్ ఎయిర్వేస్ తీరును సచిన తప్పుబట్టాడు. ఆ ఎయిర్వేస్ ' డోంట్ కేర్' విధానం నచ్చలేదని మాస్టర్ మండిపడ్డాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more