ప్లే అఫ్ కు చేరిన తొలి జట్టుగా తమ అగమనాన్ని నమోదు చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. తప్పని సరి దశకు చేరి కోల్ కతా నైట్ రేడర్స్ ను ఎలిమినేట్ రౌండ్లో చావబాది, గుజరాత్ లయన్స్ తో క్వాలిఫయర్ 2లో తలపడి మట్టికరిపించింది. అదే జోరుతో ఇక తుది సమరానికి చేరింది. ఈ తుదిపోరులో సమర్థమైన గేమ్ ప్లాన్తో ఫైనల్కు సిద్ధమవుతున్నామని, తమ టార్గెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమేనని అన్నాడు సన్ రేజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.
'బెంగళూరుతో చివరిసారిగా ఆడిన మ్యాచ్లో చాలా బాగా పుంజుకున్నాం. విరాట్ కోహ్లి నిజానికి అద్భుతమైన ఆటగాడు. అతనే మా టార్గెట్ అని చెప్పాడు. మేం అతన్ని తర్వగా ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తాం. కోహ్లి విఫలమైనా డివిలీయర్స్ ఉండనే ఉంటాడు. కాబట్టి మేం వాళ్ల జట్టులో ఉన్న ఆటగాళ్ల గురించి పెద్దగా చింతించడం లేదు. వారిని నిలువరించాలంటే సమర్థమైన గేమ్ ప్లాన్ కావాలి. దానిని మేం సిద్ధం చేసుకుంటాం' అని వార్నర్ అన్నాడు. 'మ్యాచ్ ఆసాంతం భాగస్వామ్యాలు కొనసాగేలా చూశాను. మాలో ఏ ఒక్కరూ క్రీజులో ఉన్నా.. మేం గెలుస్తామని భావించాను. ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్. ఈ (విజయం) క్రెడిట్ను నేను తీసుకోను. మేం అందరం శాయశక్తులా కృషి చేసి మా కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంది. ఇక బిపుల్ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సత్తా చాటాడు' అని వార్నర్ పేర్కొన్నాడు.
గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ లో జట్టు సారథిగా డేవిడ్ వార్నర్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. వార్నర్ కడదాక నిలబడి 93 పరుగులు చేయడంతో గుజరాత్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు ఛేదించింది. చివర్లో బిపుల్ శర్మ (27 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఘనంగా హైదరాబాద్ ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇక మరికోన్ని గంటల వ్యవధిలో తెరలేవనున్న చివరి ఘట్టానికి ఇరు జట్లు సమరశంఖాన్ని పూరించనున్నాయి. ఇటు డేవిడ్ వార్నర్, అటు విరాట్ కోహ్లి ఇద్దరూ భీకరమైన ఫామ్తో విజృంభిస్తుండటంతో ఫైనల్ రసవత్తరంగా జరుగుతుందని క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more