ప్రేమపక్షులు విరాట్ కోహ్లి-అనుష్క శర్మ విడిపోయారని అంతా అనుకున్నారు. ఇటు క్రికెట్లో అటు బాలీవుడ్లో అందమైన ప్రేమ జంటగా ముద్రపడిన వీరి మధ్య బ్రేకప్ అయినట్టు పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. కోహ్లి చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడమే వీరి బంధం తెగిపోవడానికి కారణమని వదంతులు షికారు చేశాయి. వీరు విడిపోవడం బాలీవుడ్ ప్రముఖులను కూడా కలిచివేసింది.
కానీ పరిస్థితులు ఇప్పుడు నెమ్మదిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. కోహ్లి-అనుష్క జంట మళ్లీ తమ అనుబంధాన్ని కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజా ఈ ప్రేమపక్షులు జంటగా ఓ డిన్నర్ను ఎంజాయ్ చేశాయి. బుధవారం ముంబై బాంద్రాలోని రాయల్టీ క్లబ్లో ఈ ఇద్దరూ కలిసి డిన్నర్ విందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుతూ ఆనందంగా కనిపించినట్టు సన్నిహితులు చెప్తున్నారు. డిన్నర్ ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లినట్టు సమాచారం.
ఆ ఇద్దరు కలిసి కనిపించడం విరుష్క (విరాట్-అనుష్క) అభిమానులకు పండుగే. కానీ కోహ్లి-అనుష్క తమ ప్రేమబంధాన్ని పునరుద్ధరించుకొని కలిసి ఉంటారా? లేదా స్నేహితులుగా అప్పుడప్పుడు కలుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. కోహ్లితో తన అనుబంధాన్ని కొనసాగించేందుకు అనుష్క ఇష్టపడటం లేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్ సినిమాల్లో అనుష్క నటిస్తోంది. తమ అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి కోహ్లికి మరో చాన్స్ ఇచ్చేందుకు అనుష్క సిద్దంగా లేదని వారు అంటున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more