లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మరోసారి రిటైర్మెంట్ గురించి స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పట్లో తప్పుకోబోనని, రిటైర్మెంట్ గురించి అంత తొందరేమీ లేదని ధోనీ స్పష్టం చేశాడు. 2014 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతరం ధోనీ అర్ధంతరంగా టెస్టులకు గుడ్బై చెప్పిన తరువాత నుంచి వన్డేలు, టీ-20 మ్యాచులకు ఈ 34 ఏళ్ల క్రికెటర్ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ తన సారథ్యంలో టీమిండియాకు అనేక విజయాలు అందించాడు. అతని నాయకత్వంలో 2007లో టీ -20 వరల్డ్ కప్, 2011లో వరల్డ్ కప్ భారత జట్టు సాధించింది. టెస్టుల్లోనూ అత్యుత్తమ ర్యాంకు సాధించింది.
తొమ్మిదేళ్ల కిందట దక్షిణాఫ్రికాలో అందుకున్న పొట్టి మ్యాచుల వరల్డ్ కప్ ను మళ్లీ స్వదేశంలోనూ తన చేతుల మీదుగా అందుకోవాలని ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ ఉవ్విళ్లూరుతున్నాడు. మళ్లీ టీ-20 వరల్డ్ కప్ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. లైఫ్ స్టైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ధోనీ.. మీడియాతో మాట్లాడుతూ.. 'ఆసియా కప్, టీ-20 వరల్డ్ కప్, ఆ వెంటనే ఐపీఎల్ ఇలా వరుసపెట్టి మ్యాచులు ఉన్నాయి. ఈ క్విక్ షెడ్యూల్ ముగిసిన వెంటనే టెస్టు సిరీస్లు, వన్డేలు కూడా ఉన్నాయి. అందుకు క్రికెటర్లు సన్నద్ధంగా ఉండాలి' అని ధోనీ చెప్పాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more