మరోసారి ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత మహిళలు.. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేశారు. మూడు వన్డేల సిరీస్లోభాగంగా శుక్రవారం ఇక్కడ ఇరు జట్ల మధ్యజరిగిన చివరి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా భారత్ సిరీస్ను 3-0తో వైట్ వాష్ చేసింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక మహిళలు బ్యాటింగ్ చేసి 38.2 ఓవర్లలో 112 పరుగులకే చాపచుట్టేశారు. శ్రీలంక మహిళల్లో యశోదా మెండిస్(15),ప్రసాదని వీరక్కోడి(19), శశకళా సిరివర్ధనే(14) లు తీవ్రంగా నిరాశపరిచారు. శ్రీలంక తరపున సురంగికా చేసిన 23 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో వేదా కృష్ణమూర్తి(61నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా, దీప్తి శర్మ(28) ఫర్వాలేదనిపించడంతో జట్టు స్కోరు ముందుకు కదిలింది. ఈ జోడీ మూడో వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 29.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి మ్యాచ్ లో భారత మహిళలు 107 పరుగులతో విజయం సాధించగా, రెండో మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more