ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ, ధావన్ బాధ్యతాయుతంగా ఆడి సెంచరీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. శిఖర్ ధావన్ 126 పరుగులు విరాట్ కోహ్లీ 106 పరుగులు సాధించినా.. భారత జట్టు సారధి మహేంద్ర సింగ్ దోని పరుగేలేమీ చేయకుండానే వెనుదిరగడంతో జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. నాలుగో వన్డేలో గెలుపు తథ్యం అన్న భారత క్రికెట్ అభిమానుల ఆశలు గల్లంతు కావడంపై కెప్టెన్ ధోని మ్యాచ్ అనంతరం స్పందించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఓటమికి తనదే బాధ్యతని ధోనీ అంగీకరించాడు. తాను పరుగులేమి చేయకుండా వచ్చిన వెంటనే పెవిలియన్ కు దారి పట్టడంతో ఆ ఒత్తడి జట్టుపై పడిందని దోని అంగీకరించాడు. తాను కోపంగా ఏమి లేను. కానీ, చాలా నిరాశ చెందుతున్నాను. సిరీస్లో గత మ్యాచ్ల కంటే కూడా మేం అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వన్డే ఇది. అయినా ఓటమి పాలయ్యాం. జట్టు ఓటమికి తనదే బాధ్యతని అంగీకరించాడు.
కోహ్లీ, ధావన్ బాగా ఆడినా.. తాను డకౌట్ అవడం వల్ల తన తర్వాత వచ్చిన ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిందన్నాడు. టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరినప్పుడు తాను జట్టును ముందుకు నడిపించాలని. కానీ, అవుటయ్యాను. దీంతో తన తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్లపే కూడా కాస్త ఒత్తిడి పడిందన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లు ఒత్తిడితో కూడుకున్నవని.. అయితే వాటిని అధిగమిస్తే విజయం సాధ్యమవుతుందని అన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లను గెలచి సిరీస్ ను కూడా కైవసం చేసుకున్న ఆతిధ్య జట్టు క్లీన్ స్వీప్ కు ప్రయత్నిస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more