టీమిండియా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ గా ఖ్యాతి గడించిన క్రికెటర్ వీరేంద్ర స్వేహాగ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ, దేశవాలి సహా ఐపీఎల్ క్రికెట్కు సెహ్వాగ్ వీడ్కోలు పలికారు. ట్విట్టర్ ద్వారా సేహ్వాగ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పేసర్ జహీర్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే టీమిండియా మరో దిగ్గజం సెహ్వాగ్ కూడా వీడ్కోలు పలికారు. నజఫ్గడ్ నవాబ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే వీరేంద్ర సెహ్వాగ్ ఆటను మనం ఇక అంతర్జాతీయ వేదికన చూడలేమని అభిమానులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
సేహ్వాగ్ క్రీజ్ లో వుంటే ప్రత్యర్థి బౌలర్లుకు ముచ్చమటలు పట్టేవి. ఆయన ఎంతటి బౌలర్ విసిరిన బంతులైనా సునాయాసంగా బౌండరీలకు తరలించడం మర్చపోలేమని అభిమానులు అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ టీ20 (ఎమ్సీఎల్)లో పాల్గొనేందుకే సెహ్వాగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఎమ్సీఎల్లో మాజీ క్రికెటర్లకే ఆడే చాన్స్ ఉన్నందున్న సేహ్వాగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కంటికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న సేహ్వాగ్.. గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో క్రికెట్ లో రాణించలేకపోతున్నాడు.
అంతర్జాతీయ క్రికెటర్గా సెహ్వాగ్ది మహోజ్వలంగా 12 ఏళ్ల పాటు వెలుగొందారు. కెరీర్లో 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేసిన వీరూ 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు కొట్టాడు. అలాగే 251 వన్డేల్లో 35.05 సగటుతో 8273 పరుగులు చేశాడు. ఇందులో 15 అర్ధ సెంచరీలు, 38 అర్ధ సెంచరీలున్నాయి. టెస్టుల్లో సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు. భారత తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడు సెహ్వాగే. అత్యంత వేగంగా త్రిశతకం సాధించిన ఘనత (278 బంతుల్లో) కూడా తన పేరునే రాసుకున్నాడు సెహ్వాగ్. వన్డేల్లో సచిన్ తర్వాత డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్మన్ కూడా ఆయనే కావడం గమనార్హం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more