ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోని సేన సమిష్టి కృషి ఫలితంగానే విజయాన్ని నమోదు చేసుకుందని దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఏబి డెవిలియర్స్ అన్నాడు. టీమిండియా - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ వన్డే మ్యాచ్ చివరి ఓవర్లు చూసిన వాళ్లెవరూ ఆ గేమ్ను మర్చిపోలేరని అభిప్రాయపడ్డారు. ఒక బ్యాట్స్మన్ విధ్వంసం సృష్టిస్తుంటే.. కాసేపటికల్లా ఓ బౌలర్ రెచ్చిపోయి వికెట్లు తీస్తున్నాడు. మళ్లీ కాసేపటికే రబడా లాంటి టెయిలెండర్లు కూడా బౌండరీలు బాదేస్తుంటే... అంతలోనే మళ్లీ భువనేశ్వర్ కుమార్ జూలు విదిల్చి టపటపా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతే, మ్యాచ్ టీమిండియా వశమైపోయింది.
కళ్లెదుటే కనపడుతున్న ఈ అద్భుతం నాకు నోట మాట రాలేదని ఏబి డెవిలియర్స్ అన్నాడు. తమ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ని ఇండియా తమ చేతుల్లోకి లాగేసుకుందని అన్నాడు. ధోని సేన అద్భుతంగా ఆడటంతో పాటు సమిష్టిగా రాణించడంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. అయితే మ్యాచ్ ఓటమికి మరో కారణం.. తమ వాళ్ల బ్యాటింగ్ అని.. ఏమాత్రం కుదురుగా, నిలకడగా రాణించలేకపోడమేనని చెప్పుకొచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, కేవలం 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదికూడా సారథి ధోనీ 92 పరుగులు చేసి నాటౌట్గా మిగలడం వల్లే. స్వల్ప స్కోరును చేధించేందుకు బరిలో దిగిన తమ బ్యాట్స్ మెన్లు చతికిల పడటంతో.. వారిని విజయం వరించిందన్నాడు.
ఈ క్రెడిట్ చాలావరకు ఇండియాకే దక్కాలని మ్యాచ్ తర్వాత ఏబీ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి తమ ఎదుట ఉన్న లక్ష్యం చిన్నదేనని, అయితే ఓపెనింగ్ భాగస్వామ్యం బాగున్నా దాన్ని నిలబెట్టుకోవడం తమవాళ్లకు చేతకాలేదని ఒప్పుకొన్నాడు. ఛేజింగ్ చేసేటప్పుడు కాస్త పాజిటివ్గా ఉండాలని, కానీ తాము మాత్రం అలా ఉండలేకపోయామని చెప్పాడు. తమ బౌలర్లు చాలా బాగా పెర్ఫామ్ చేయడం వల్లే టీమిండియాను కట్టడి చేయగలిగామని, అయితే బ్యాట్స్మన్ వైఫల్యం విజయాన్ని తమకు అందకుండా చేసిందని అన్నాడు. ఇక తన వెన్నెముక గాయం పెద్దదేమీ కాదని, తదుపరి మ్యాచ్ నాటికి పూర్తి సిద్ధంగా ఉంటానని తెలిపాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more