టీమిండియాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి పూర్తి విశ్వాసంతో ఉన్న దక్షిణాఫ్రికా ఇకపై జరగనున్న వన్డే సిరీస్ పై కూడా అదే ప్రతిభను కనబర్చి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే సఫారీల జట్టు కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ మాత్రం టీమిండియాతో జరగనున్న అసలైన ఛాలెంజ్ వన్డేల రూపంలో ఉందని అభిప్రాయపడ్డాడు. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉందన్నాడు. ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన టీమిండియా మరింత కసిగా వన్డే సిరీస్ కు సన్నద్ధమవుతుందనడంలోఎటువంటి సందేహం లేదని డివిలియర్స్ తెలిపాడు.
'ఒక గొప్ప సిరీస్ లో మాకు శుభారంభం లభించినందకు ఆనందంగా ఉంది. అదే ఆటతీరును వన్డేల్లో కూడా కొనసాగించడానికి పూర్తి స్థాయిలో యత్నిస్తాం. ఇప్పుడు మా ముందు వన్డే సిరీస్ రూపంలో అతి పెద్ద ఛాలెంజ్ ఉంది. వన్డే సిరీస్ ను కూడా గెలుస్తామని నమ్మకంగా ఉన్నాం. టీమిండియాతో జరుగుతున్న సిరీస్ లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. పలురకాలైన గ్రౌండ్లలో , వివిధ రకాలైన వికెట్లపై ఆడాలి. ఇప్పుడు అది కచ్చితంగా మాకు ఒక ఛాలెంజ్. భారత్ ను స్వదేశంలో కట్టడి చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతాం. సిరీస్ ను గెలవడమే మాకు ఇష్టం. టీమిండియా కూడా మమ్మల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతుంది' అని డివిలియర్స్ తెలిపాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more