స్పాట్ ఫిక్సింగ్ కు అంగీకరించి అడ్డంగా దోరికిపోయిన పాకిస్థాన్ క్రికెట్ త్రయం మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సందడి చేయనున్నారా? అంటే పీసీబీ పెద్దలు అవుననే అంటున్నారు. ఇంగ్లాండ్ తో ఐదేళ్ల క్రితం లార్డ్స్లో జరిగిన మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కోన్న ఆటగాళ్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్, మహ్మద్ అమీర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డులొకి కొందరు పెద్దలు చకచకా పావులు కదుపుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను ఉలిక్కిపడేలా చేసిన ఈ ముగ్గురిపై ఐదేళ్ల పాటు ఐసిసీ విధించిన నిషేధం సెప్టెంబర్ 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురని ఆరు మాసాల పాటు రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఆరుమాసాల పాటు వారు పాకిస్థాన్ క్లబ్ క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుమతినిచ్చింది. దీంతో మరో ఆరు మాసాల తరువాత ఈ ముగ్గురు ఫిట్ నెస్ నిరూపించుకున్న పక్షంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టనున్నారు.
2010లో ఇంగ్లండ్ తో సిరీస్ ఆడిన సందర్భంగా వీరి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని ఓ స్థానిక న్యూస్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. అప్పటి వరకు మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమే ఉంటుందని తెలిసిన అభిమానులకు స్పాట్ ఫిక్సింగ్ ను ఆసిఫ్, భట్, అమీర్ పరిచయం చేశారు. వీడియో పుటేజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో వీరు ముగ్గురికి ఐదేళ్లపాటు ఐసీసీ నిషేధం విధించింది. సెప్టెంబర్ 1తో వీరిపై నిషేధం ముగియనుండడంతో వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు పీసీబీ ఆ ముగ్గురినీ హెడ్ ఆఫీస్ కు పిలిపించుకుంది. లాహోర్ లోని హెడ్ ఆఫీస్ లో వారి అభిప్రాయాలు తెలుసుకున్న పీసీబీ, వారిని మళ్లీ క్రీజులోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more