శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం దిశగా ఉరకలు వేస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు అద్భుత శతకాలను నమోదు చేయడంతో కోహ్లీ సేన పటిష్ట స్థితిలో నిలిచి.. మ్యాచ్ పై భారత్ పట్టుబిగించింది. శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్ లో 192 పరుగుల అధిక్యతను నమోదు చేసిన టీమిండియా 375 పరుగులకు అలౌట్ అయ్యింది. రెండు వికెట్ల నష్టానికి 128 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్... ఏమాత్రం పట్టుసడలించకుండా లంక బౌలర్లను ఉతికి అరేసింది. రెండో రోజున 247 పరుగులను జోడించిన టీమిండియా 8 వికెట్లను కోల్పోయింది.
లంక బౌలర్ల గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ.. ధీటుగా బ్యాటింగ్ కొనసాగించింది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 178 బంతుల్లో పది ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఇది ధావన్కు నాలుగో సెంచరీ కావడం గమనార్హం. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా తన కెరీర్ లో 11వ టెస్టు సెంచరీని నమోదు చేసుకున్నారు. వీరి తరువాత వృద్దిమాన్ సాహ కూడా అద్భుతంగా రాణించి అర్థశతకాన్ని నమోగు చేశాడు. సాహా చివరిలో 60 పరుగులతో స్కోరు బోర్డును పరుగులెత్తించగా, మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవరూ అంతగా రాణించలేదు.
లంక బౌలర్లలో కౌశల్ 5 వికెట్లు దక్కించుకోగా, ప్రదీప్ 3 వికెట్లు, ప్రసాద్, మాథ్యూస్ చెరో విక్కెట్ పడగోట్టారు. తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేసిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత స్పిన్ మాయాజాలనికి తలవంచింది. ఒక్క పరుగుకే రెండు వికెట్లను నష్టపోయింది. ఓపెనర్లు ఇద్దరు డౌకట్ అయ్యారు. కరుణ్ రత్నేను అశ్విన్, సిల్వను అమిత్ మిశ్రా క్లీన్ బౌల్డ్ చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమాయానికి రెండు వికెట్ల నష్టానికి ఐదు పరుగుల స్కోరును లంక నమోదు చేసింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more