భారత్, శ్రీలంక జట్ల మధ్య బుధవారం గాలె లో ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ పక్షాన నిలిచింది. తొలి రోజు అట ముగిసే సమయానికి టీమిండియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులు సాధించింది. టీమిండియా జట్టు ఓపెనర్ లోకేష్ రాహుల్ మూడు పరుగులకే వెనుదిరగగా. అ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన రోహిత్ శర్మ కూడా పేలవమైన ఆటతీరుతో కేవలం 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలసి స్కోరుబోర్డును ముందుకు పరుగులు పెట్టించి అర్థశతకాన్ని నమోదు చేశాడు శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీ కూడా అర్థ శతకానికి ఐదు పరుగుల దూరంలో నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో దమ్మిక ప్రసాద్, మాథ్యూస్ లకు చెరో విక్కెట్ లభించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన లంక జట్టు కేవలం 183 పరుగులకే చాపచుట్టేసింది. ఓపెనర్లను భారత పేసర్లు వెనక్కు పంపగా, తన మెరుగైన ఆటతీరుతో రవిచంద్రన్ అశ్విన్ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను ఊపరి సల్పనీయకుండా చేశారు. ఆతిథ్య జట్టు భారత స్పిన్నర్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడింది. అశ్విన్ అద్భుతంగా రాణించడంతో లంక 183 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక బ్యాట్స్మెన్లలో మాథ్యూస్ 64, చండిమాల్ 59 పరుగులతో రాణించి లంక పరువుని కాపాడారు. మిగిలిన వారందరూ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. శ్రీలంక ఓపెనర్లు కరుణరత్న(9), కౌశల్ సిల్వ(5) భారత్ పేసర్లు ఇషాంత్, అరోన్ దెబ్బకు వెంట వెంటనే వెనుదిరిగారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగర్కర్ కూడా 5 పరుగుల చేసి అశ్విన్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరడంతో లంకకు కష్టాలు ఆరంభమయ్యాయి. ఆ తరువాత వచ్చిన తిరిమన్నె, ముబారక్ను కూడా అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో బురిడీ కొట్టించాడు. దీంతో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల వికెట్లు కోల్పయిన లంక జట్టును మాథ్యూస్, చండిమాల్ కు ఆదుకున్నారు. శ్రీలంక ఆటగాళ్లు కరుణరత్నే 9, శిల్వ 5, తిరిమన్నే 13, సంగక్కర 5, ముభారక్ డకౌట్ కాగా మథ్యూస్ 64, ఛండీమాల్ 59, ప్రసాద్ డకౌట్, హేరత్ 23, కౌషల్ డకౌట్ కాగా ప్రదీప్ 1 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. భారత బౌలర్లు ఇషాంత్ శర్మ1, అశ్వన్ 6, అరోన్1, మిశ్రా 2 వికెట్లు తీసుకున్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more