యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు పేలవ ప్రదర్శనకు నైతిక బాద్యత వహించిన జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ గుడ్ బై చెప్పనున్నారు. ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ఆయన టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెప్పనున్నాడు. యాషెస్ సిరీస్ తర్వాత 34 ఏళ్ల క్లార్క్ టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. యాషెస్ చివరి టెస్టు తర్వాత రిటైరవుతున్నట్టు క్లార్క్ ఓ ఆస్ట్రేలియా పత్రికలో రాసిన ఓ వ్యాసంలో పేర్కొన్నాడు. క్లార్క్ సుధీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయాల కారణంగా బ్యాటింగ్లో రాణించలేకపోతున్నాడు. దీనికి తోడు యాషెస్ సిరీస్ పరాజయం అతనిపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఘోర ఓటమి పాలైంది. శనివారం ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్లో నామమాత్రమైన చివరి, ఐదో టెస్టు ఈ నెల 20న ఓవల్ లో ప్రారంభం కానుంది. క్లార్క్కు ఇదే చివరి టెస్టు కావచ్చు. 2004లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన క్లార్క్ తన కెరీర్లో 114 మ్యాచ్లు ఆడాడు. 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8605 పరుగులు చేసిన క్లార్క్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్)గా నమోదు చేసుకున్నాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more