మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరొందిన మహేంద్రసింగ్ ధోనీ.. గతకొన్నాళ్ల నుంచి అతని సారధ్యంలో టీమిండియా ఎన్నో పరాజయాలు పాలవడంతో అతగాడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ మధ్య టెస్టు ఫార్మాట్ లో వరుసగా టీమిండియా ఓడిపోవడంతో.. తనపై వచ్చిన విమర్శనాస్త్రాలకు రిటైర్ మెంట్ తో తన జవాబిచ్చాడు. దీంతో ధోనీ వన్డే, టీ20 ఫార్మాట్ మ్యాచులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ రెండు ఫార్మాట్ లలోనూ ఇండియా వరుసగా ఓటమి పాలవడుతుండటంతో ధోనీ మీద విమర్శలు మరింత పెరిగిపోయాయి. గతంలో కంటే ఇతని ఇమేజ్ కాస్త తగ్గింది కూడా. కానీ.. ఇతని బ్రాండ్ వ్యాల్యూ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాణిజ్య విలువల్లో ధోనీ ఇమేజ్ అస్సలు తగ్గలేదు.
వివరాల్లోకి వెళ్తే.. లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా టాప్-10 స్పోర్ట్స్ పర్సన్స్ (మోస్ట్ మార్కెటబుల్) జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ధోనీకి 9వ స్థానం లభించింది. ఇటీవలే కాలంలో ఇతని మీద విమర్శలు తారాస్థాయిలో పెరగడంతో ధోనీ వ్యాల్యూ పడిపోయిందని అంతా భావించారు కానీ.. ఈ జాబితా మాత్రం అందరికీ షాక్ తగిలేలా నివేదికను వెల్లడించింది. ధోనీపై ఎన్ని విమర్శలొచ్చినా అతని బ్రాండ్ వ్యాల్యూ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఈ నివేదిక నిరూపించింది. అంటే.. ఇప్పటికీ చాలా సంస్థలు తమ ప్రోడక్టులను ప్రమోట్ చేసుకోవడం కోసం ధోనీని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంటున్నాయి. అలా తండోపతండాలుగా రావడంతో ధోనీ బ్రాండ్ వ్యాల్యూ ఇతర భారతీయ దిగ్గజాల కంటే పెరిగిపోయింది. ఇప్పటికీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది కూడా!
ఇక ఈ జాబితాలో తొలిస్థానంలో స్విస్ టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ తొలిస్థానంలో నిలువగా.. గోల్ఫ్ ఆటగాడు టైగర్ ఉడ్స్ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే జకోవిచ్ 7వ స్థానంలో, నాదల్ 8వ స్థానంలో వున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఫుట్ బాల్ సూపర్ స్టార్లు క్రిస్టియానా రొనాల్డో, లియోనిల్ మెస్సీ, అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్ ల కంటే ధోనీ బ్రాండ్ వ్యాల్యూ అధికంగా వుండటం విశేషంగా మారింది. చివరగా.. భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం ఈ జాబితాలో 78వ స్థానంలో నిలిచారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more