Stuart Binny’s all-round show, Ambati Rayudu help India beat Zimbabwe by 4 runs in 1st ODI at Harare

India beat zimbabwe by 4 runs in 1st odi at harare

ambati rayudu, india, india tour of zimbabwe 2015, Team india, Stuart Binny, rayudu and binny partnership, india vs zimbabwe, india vs zimbabwe 2015, zimbabwe, zimbabwe vs india, zimbabwe vs india 2015, ind vs zim, ind vs zim 2015, Ambati Rayudu, Elton Chigumbura, Stuart Binny, Zimbabwe, Zimbabwe vs India, Zimbabwe vs India 2015

Stuart Binny’s all-round performance along with an unbeaten ton by Ambati Rayudu could helped India beat Zimbabwe by four runs in a nail-biting finish in the first One-Day at Harare.

ఉత్కంఠకర పోరులో జింబాబ్వేపై గెలిచిన టీమిండియా..

Posted: 07/10/2015 09:33 PM IST
India beat zimbabwe by 4 runs in 1st odi at harare

జింబాబ్వేతో జరుగుతున్న తొలివన్డే మ్యాచ్ లో టీమిండియా.. అతిధ్య జట్టుపై నాలుగు పరుగులతో విజయాన్ని సాధించింది. పసికూనలపై జరిగిన తొలి వన్డేలో రహానే సేన మొక్కవోని విశ్వాసంతో విజయాన్ని నమోదు చేసుకుంది. నువ్వా-నేనా అన్న రీతిలో సాగిన ఈ పోరులో భారత దిగ్గజాలు, హేమాహేలీలు లేకుండానే రంగంలోకి దిగిన రహానే సేన విజయాన్ని లిఖించింది. రహానే సేన నిర్ధేశించి 256 పరుగుల విజయలక్ష్యాన్ని నాలుగు పరుగుల దూరంలో జింబాబ్వే చేజార్చుకుంది.

256 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే అదిలోనే వికెట్లను కొల్పోయి కష్టాలు పడినట్లు కనిపించినా.. జింబాబ్వే సారది చిగుంబరా కెప్టెన్ ఇన్నింగ్ ఆడి రహానే సేనకు చమటలు పట్టించాడు. కాగా చిగుంబరాకు జట్టు బ్యాట్స్ మెన్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. కాగా జింబాబ్వే కెప్టెన్ చిగుంబరా 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్ని, అక్షర్ పటేల్ లకు చెరో రెండు విక్కెట్లు లభించగా, భువనేశ్వర్ కుమార్, ధవల్ కుల్ కర్ణీ, హర్బజన్ సింగ్ లకు చెరో వికెట్ లభించింది.

అంతుకు ముందు ,, నిర్ణీత యాభై ఓవర్లలో టీమిండియా ఆరు విక్కెట్ల నష్టానికి 255 పరుగులు సాధించింది. తెలుగు తేజం అంబటి రాయుడు అద్బుత సెంచరీతో రాణించాడు. అంబటి రాయుడుకు స్టూవర్ట్ బిన్ని కూడా సహకరించడంతో భారత్ మెరుగైన స్కోరు చేయగలిగింది.మ్యాచ్ ఆరంభంలో పరుగులను చేయడానికి టీమిండియా చమటోడ్చింది. చాన్నాళ్ల తరువాత వన్డే జట్టులో స్థానం పోందిన మురళీ విజయ్ ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. కేవలం ఒక్క పరుగుకే అవుటై వెనుదిరిగాడు.

ఆ తరువాత బ్యాటింగ్ లోకి దిగిన అంబటి రాయుడు, వన్డే కెప్టెన్ రహానే కలసి జింబ్వాబే బౌలర్లను నిదానంగా ఎదుర్కోన్నారు. ఒక క్రమంలో పది ఓవర్లకు 35 పరుగులు మాత్రమే టీమిండియా చేసింది. ఈ ధశలో కెప్టెన్ రహానే 34 పరుగలు వద్ద అవుట్ కావడంతో ఆ తరువాత వచ్చిన మనోజ్ తివారీ, రాబిన్ ఉత్తప్ప, కేధార్ జాదవ్ లు వెనువెంటనే పెవీలియన్ కు చేరుకున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు స్కోరు రెండకెలకు కూడా చేరుకోలేదు. ఈ దశలో వచ్చిన స్టువర్ట్ బిన్ని నిలదొక్కుకుని ఆరు ఫోర్లు రెండు సిక్స్ లతో అంబడి రాయుడికి సహకరించడంతో వీరిద్దరు బాగస్వామం 145 పరుగులు వరకు కొనసాగింది.

స్టువర్ట్ బిన్ని76 బంతుల్లో 77 పరుగులతో అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీస్ లోకి వచ్చిన మరో ఆటగాడు అక్షర్ పటేల్ రెండు పరుగులతో నాటౌట్ గా నిలువగా, అంబటి రాయుడు 133 బంతులు ఎదుర్కోని ఒక సిక్సర్, 12 ఫోర్ల సాయంతో 124 పరుగులతో అంబటి రాయుడు జింబాబ్వే పై రెండో అజేయ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. జింబాబ్వే జట్టులో డోనాల్డ్ తిరిపానో, చమ్ము చిబ్బాబ్బ చెరో రెండీసీ వికెట్లు పడగొట్టగా, బ్రాయన్ విటోరి ఒక్క వికెట్ ను సాధించాడు.  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వేను బ్యాటింగ్ చేయాల్సి వుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  zimbamwe  anbati rayudu  stuart binny  Elton Chigumbura  

Other Articles