వచ్చే నెలలో జరగనున్న శ్రీలంక పర్యటనకు ఓ వారం ముందుగానే వెళ్లాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలను సిద్దం చేసింది. దీనివల్ల అక్టోబర్-నవంబర్ మాసాల్లో స్వదేశంలో జరిగే సౌత్ అఫ్రికా జట్టుకు ముందు ఆటగాళ్లకు తగినంతవిశ్రాంతి కల్పించాలన్న భావనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి వుంది. ఈ టూర్లో లంకతో టీమిండియా మూడు టెస్ట్ల సిరీస్ను ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఆగస్ట్ 11న ప్రారంభం కావాల్సింది. చివరిసారి 2010లో భారత్.. లంక పర్యటనకు వెళ్లింది.
కాగా ప్రస్తుతం జింబాబ్వే తో మూడు వన్డేలు, రెండు టీ-20లు అడేందుకు జింబాబ్వే చేరుకున్న టీమిండియా ఈ నెల 20న స్వదేశానికి తిరిగి రానుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ను దృష్టిలో పెట్టుకుని లంక టూర్ను సాధ్యమైనంత తర్వాత ముగించి, ఆటగాళ్లకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో భారత్ నాలుగు టెస్ట్లు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల్లో తలపడనుంది. అయితే ఈ విషయమై రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. కాగా, భారత్ - శ్రీలంక సీరిస్ కు సంబంధించిన ప్రసార హక్కులను సోని సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా 3.25 మిలియన్ డాలర్లు మన కరెస్సీలో సుమారుగా 19 కోట్ల 50 లక్షల రూపాయలను లంకబోర్డుకు ఇవ్వనుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more